ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

Update: 2024-05-12 23:58 GMT
Live Updates - Page 6
2024-05-13 07:23 GMT

కిషన్ రెడ్డి, కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలి: నారాయణ

కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, కేటీఆర్‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీపీఐ నారాయణ కోరారు. బాధ్యతాయుత వ్యక్తులే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం బాధాకరం అని అన్నారు.


2024-05-13 07:17 GMT

వైసీపీ, టీడీపీ మధ్య రాళ్ల దాడి


అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసిపి, టిడిపి కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. పట్టణంలోని ఓం శాంతి నగర్‌లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, టిడిపి అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డి లు పరస్పరం ఎదురుపడ్డారు. ఇరు వర్గాలు మధ్య మాటామాటా పెరగడంతో ఒక్కసారిగా ఉన్నట్లుండి రాళ్ళు రువ్వారు. రాళ్ల దాడిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేకి సైతం దెబ్బలు తగినట్లు తెలుస్తోంది

2024-05-13 07:13 GMT

ఓటేసిన అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మడ గ్రామం జెడ్‌పీహెచ్ఎస్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఆయనతో పాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.

2024-05-13 07:05 GMT

ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి


చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం ఎర్రాతి వారి పల్లెలో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు


2024-05-13 07:02 GMT

మదనపల్లెలో వైసిపి, టీడీపీ నేతల ఘర్షణ


మదనపల్లెలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ఆవరణలో వాతావరణం హీటెక్కింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరు పార్టీలో పోలింగ్ సమయంలో కూడా జోరుగా ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రచారం చేయకూడదంటూ రెండు పార్టీల నేతలు ప్రత్యర్థి పార్టీ నేతలకు చెప్పడంతో మొదలైనా వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్థిచెప్పారు.


2024-05-13 06:55 GMT

కడపజిల్లా పోలింగ్ శాతం 11:30 AM

కడప. 21 %

కమలాపురం 26 %

మైదుకూరు 24 %

ప్రొద్దుటూరు 25 %

జమ్మలమడుగు 34 %

పులివెందుల 31 %

బద్వేలు. 30 %

2024-05-13 06:50 GMT

ఏపీలో ఉదయం 11 గంటల వరకు 24 శాతం పోలింగ్ నమోదు..

అల్లూరి జిల్లా    18.61 శాతం

అనకాపల్లి    19.75శాతం

అనంతపురం    23.90శాతం

అన్నమయ్య    22.28శాతం

బాపట్ల    26.88శాతం

చిత్తూరు    25.81శాతం

అంబేద్కర్‌ కోనసీమ    26.74శాతం

తూర్పు గోదావరి    21.75శాతం

ఏలూరు    24.28శాతం

గుంటూరు    20.84శాతం

కాకినాడ    21.26శాతం

కృష్ణా    25.84శాతం

కర్నూలు    22.05శాతం

నంద్యాల    27.19శాతం

ఎన్టీఆర్ జిల్లా    21.39శాతం

పల్నాడు    23.25శాతం

పార్వతీపురం మన్యం    15.40శాతం

ప్రకాశం    23.89శాతం

నెల్లూరు    23.77శాతం

శ్రీసత్యసాయి    20.61శాతం

శ్రీకాకుళం    21.37శాతం

తిరుపతి    22.66శాతం

విశాఖ    20.47శాతం

విజయనగరం    23.21శాతం

ప.గో    23.26శాతం

కడప     27.02శాతం

2024-05-13 06:29 GMT

రాష్ట్రవ్యాప్తం పోలింగ్ శాతం


నేడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉదయం 11.00 గంటలకు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సగటున పోలైన ఓటింగ్ శాతం 23.10%

2024-05-13 06:28 GMT

ఓటు వేసిన గల్లా జయదేవ్ కుటుంబం

గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరులోని పట్టాభిపురం బేసిక్ హైస్కూలప్లో వారు ఓటు వేశారు. గల్లా సిద్దార్థ్ సినీ నటుడు అశోక్ గల్లా కూడా ఓటు వేశారు.

2024-05-13 06:15 GMT

పోలింగ్ శాతంపైనా బెట్టింగ్

పోలింగ్ ఎక్కువ జరిగితే ఎవరికి లాభం అనే అంశంపైనా బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 73 నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది అనే దానిపై లక్షల్లో పందాలు కాస్తున్నారు. ఈ 73 నియోజకవర్గాల్లో అత్యధిక భాగం రాయలసీమ జిల్లాల్లో ఉన్నాయి.

Tags:    

Similar News