ఐపీఎల్ వేలం: కోట్లు కొల్లగొట్టిన అన్ క్యాప్డ్ ఆటగాళ్లు
రూ.14.20 కోట్లకు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మను కొనుగోలు చేసిన సీఎస్కే
అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో అనామక ఆటగాళ్లపై సీఎస్కే కోట్లు ఖర్చు చేసింది. ఉత్తర ప్రదేశ్ ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ ను రూ. 14.20 కోట్లకు కొనుగోలు చేసింది. వీర్ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు.
ఈ యువ ఆల్ రౌండర్ ను రవీంద్ర జడేజా స్థానంలో సీఎస్కే ఆడించబోతోంది. రవీంద్ర జడేజాను సీఎస్కే రాజస్థాన్ రాయల్స్ కు అప్పగించింది. జడ్డూలాగే వీర్ కూడా ఎడమచేతి వాటం స్పిన్నర్, బ్యాట్స్ మెన్.
ఈ 20 ఏళ్ల యువ ఆటగాడు నోయిడా సూపర్ కింగ్స్ తరఫున యూపీ టీ20 లీగ్ లో మంచి ప్రదర్శన చేశాడు. ఇంతకుముందు వీర్ సీఎస్కే ట్రయల్స్ లో కూడా కనిపించాడు.
ఇప్పటి వరకూ తొమ్మిది టీ20 మ్యాచ్ల్లో వీర్ 167.16 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. అలాగే 12 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫితో పాటు ఉత్తరప్రదేశ్ అండర్ -23 మ్యాచ్ లలో కూడా ఆడాడు.