తిరుపతి పెద్దపండుగకు జోరందుకున్న ఏర్పాట్లు..

తిరుమల బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ శ్రద్ధ తీసుకుంటోంది. గరుడోత్సవం రోజు యాత్రికుల సదుపాయాలపై దృష్టి సారించింది. ఈఓ అన్ని విభాగాలను సమన్వయం చేశారు.

Update: 2024-09-19 16:26 GMT

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జే.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో తగినంత పార్కింగ్ లేదు. అందువల్ల ట్రాఫిక్ ఇబ్బందులు నివారించడానికి ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించాలని ఆదేశించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాల్గవ తేదీ ప్రారంభం అవుతాయి. ఈ ఉత్సవాల్లో ఎనిమిదో తేదీ శ్రీవారికి నిర్వహించే గరుడసేవ ప్రధానమైనది.

తిరుపతికి పెద్ద పండుగ


గరుడోత్సవం తిరుపతి, తిరుమలకే కాదు. చిత్తూరు జిల్లాకు పెద్ద పండుగ. ప్రతి ఇంటి నుంచి ఈ ఉత్సవాన్ని చూసి తరలించాలని తిరుమలకు వెళతారు. తిరుపతి నుంచే కాకుండా, చిత్తూరుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి కూడా భారీగా తరలివస్తారు. కనీసం ఐదు లక్షల మంది వస్తారనేది అంచనా. 2007లో జరిగిన రెండు బ్రహ్మోత్సవాల వేళ తిరుమల మొదటిసారి కిటకిటలాడింది. మాడవీధుల్లోని గ్యాలరీలు, తిరుమల కొండ యాత్రికులతో నిండిపోయింది.

ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఏటా బ్రహ్మోత్సవాల వేళ ప్రత్యేక తీసుకుంటోంది. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాల నిర్వహణ పర్యవేక్షణ చేస్తున్న టీటీడీ ఈవో శ్యామలరావు, తిరుమల అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, టీటీడీ సీవీఎస్ఓ శ్రీధర్ కు కూడా మొదటిసారి. దీంతో అధికారులను సమన్వయం చేయడానికి రోజూ అన్ని అంశాలపై యంత్రాంగాన్ని సమాయత్తం చేయడానికి సమీక్షలు నిర్వహించడం ద్వారా బాధ్యతలు వికేంద్రీకరిస్తున్నారు. అందులో భాగంగా
ఏర్పాట్లపై ప్రత్యేక సమీక్ష


తిరుమలలో అక్టోబర్ 8న నిర్వమించే గరుడోత్సానికి భారీగా వచ్చే భక్తుల రద్దీని దృష్ట్యా ఆర్టీసీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని యాత్రికులకు టీటీడీ సూచించింది. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో గురువారం ఈవో జే. శ్యామలరావు అధికారులతో సమావేశమయ్యారు. టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్ఓ శ్రీధర్, టీటీడీ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం చెంగల్ రెడ్డి , ఇతర శాఖల అధికారులకు బాధ్యతలు వికేంద్రీకరించారు. టీటీడీ విభాగాల అధికారులు, పోలీస్, అగ్నిమాపక శాఖ, భద్రత, రవాణా ఏర్పాట్లపై సమీక్షించారు.
ముఖ్యమైన అంశాలు

గత రెండేళ్లుగా తిరుమలలో వాహనాల రాకపోకలు పెరిగాయి. దీం వాహనాలకు పార్కింగ్‌ స్థలాల కొరత తీవ్రంగా ఉంది. తిరుమలలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి, గరుడసేవ రోజు భక్తులను తిరుమలకు తరలించడానికి ఏపీఎస్ఆర్టీసీ తగిన సంఖ్యలో బస్సులను నడపాలి.
 అలిపిరి లింక్ బస్టాండ్, మున్సిపల్ గ్రౌండ్స్, వినాయక నగర్ క్వార్టర్స్‌లో ద్విచక్ర వాహనాలు, భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో ప్రైవేట్ జీపులు, కార్లు సహా అన్ని నాలుగు చక్రాల వాహనాలు, ఎస్వీ జూ పక్కనే ఉన్న దేవలోక్‌లో ప్రైవేట్ బస్సులకు పార్కింగ్ ఏర్పాటు.

చిన్నారులకు ట్యాగ్
చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగింగ్ చేయాలిని నిర్ణయించారు. లగేజీ సెంటర్‌ను ప్రస్తుతం ఉన్న కామన్ కమాండ్ సెంటర్ పాయింట్ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు సేవా సదన్ 1, 2 ఎదురుగా మార్చాలి. అన్నప్రసాదం పంపిణీతో పాటు అన్నప్రసాదాన్ని గ్యాలరీలకు తరలించే వాహనాల రూట్ మ్యాప్ రూపొందించడంతో సహా ఇతర ముఖ్యమైన అంశాలను చర్చించారు.
తిరుమల నాలుగు మాడ వీధులలో ఎప్పటికప్పుడు భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించాలి. తద్వారా యాత్రికులకు మరిన్ని మే ఐ హెల్ప్ యూ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
సాంస్కృతిక బృందాలు, సిమ్స్, రుయా, బర్డ్ నుంచి అదనపు వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలి. తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్య పనులు చేయడానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో తిరుపతిలో కూడా పారిశుద్ధ్య పనుల విస్తృత ఏర్పాట్లపై చర్చించారు.
తిరుమలో  తనిఖీలు

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు, క్యూలో వేచి ఉన్న భక్తులతో టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీఓ సురేంద్ర, ఏఈఓలు శ్రీహరి, మునిరత్నం, ఏవీఎస్‌వో మనోహర్ తో కలిసి ఆయన యాత్రికులతో మమేకం అయ్యారు.

టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించేందుకు రోజూ ఆయన ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా దనపు ఈవో కయ్య చౌదరి గురువారం వైకుంఠం కంపార్ట్‌మెంట్లను పరిశీలించారు. యాత్రికులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందించే నిర్దేశిత సమయాలను పరిశీలించారు. కంపార్ట్‌మెంట్ల నుంచి భక్తులను దర్శనానికి వదలి సమయాన్ని పరిశీలించారు. అక్కడి సిబ్బందికి ఆయన సూచనలు చేశారు.
Tags:    

Similar News