కొమ్మినేని అరెస్టు: బోలెడు సవాళ్లు
టివిలో ఏదైనా చెప్పే స్వేచ్ఛ ఉందా? అధికార, ప్రతిపక్ష రాజకీయాల కక్షిధోరణి ఫాక్షన్ నేరాలు కావా?;
స్వేచ్ఛ మీద కమ్ముకున్న ప్రమాదం గమనించాలి. కొమ్మినేని అరెస్టు సంఘటన, సంఘర్షణ. ఇది జర్నలిజంమీద దాడి అవుతుందా, లేక ప్రజాస్వామ్యంలో మన స్వాతంత్ర్య స్వేచ్ఛకు భంగం అయినట్టేనా? బోలెడు సవాళ్లు అంటూ రాసుకుంటున్నాం. రాజకీయ, న్యాయ, మీడియా పరమైన అంశాలన్నో కొమ్మినేని అరెస్టు సంఘటనలో ఉన్నాయి. చట్టాలు, వాటి నియమాల ఉల్లంఘనలు, ఆ చట్టపరమైన వివరాలు చాలా ప్రస్తావించవలసి ఉంటాయి. ఇక మధ్యలో మనం నీతి, నైతిక లక్షణాలు, అనైతిక ఘోరాలు, నేరాలు, మనం అందరం మరిచిపోయిన ఎథిక్స్ గురించి కూడా మాట్లాడుకుంటే మాగుంటుంది. గొంగళ్లో వెంట్రికలు ఏరుకుంటున్నట్టు నైతిక సమస్యలను కూడా ఉన్నాయి కదా.
అరెస్టు కారణం ఏమిటి?
పత్రికలు చదువుకునే వారు సోషల్ మీడియాలో చూసేవారికీ అరెస్టు ఎందుకో తెలిసే ఉంటుంది. 2025 జూన్ 6న, ప్రముఖ జర్నలిస్టు, సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ రావుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన ఆరోపణలు ఒకటే రెండా? హద్దు లేకుండా ఏదైతే అది మాట్లాడకూడదు అని అర్థం కావాలి. ఒక టీవీ చర్చా జరుగుతున్నపుడు ఎపి రాజధాని అమరావతిని ఎవరైనా "దేవతల రాజధాని" కాదనీ, "వేశ్యల రాజధాని" అని చెప్పడం న్యాయమా; దాని అర్థం ఏమిటి? ఇది తిట్టా లేక, నిందా, లేక ఆరోపణా లేదా సాదా సీదా వ్యాఖ్య అందామా? అటు చర్చ నిర్వహకులైన శ్రీనివాస రావు ఆ మాట చెప్పడం ఆయన విస్తృతమే అనుభవం కలిగిన వ్యక్తి అనవలసింది కాదు. తన వ్యాఖ్యలను తాను చేయలేదని కొమ్మినేని వివరణ ఇచ్చారు. అంతే కాదు, సాక్షి పత్రిక యాజమానులు ఈ వ్యాఖ్యతో తమకు సంబంధంలేదని వదిలేసారు. చట్టం ప్రకారం కామన్ సెన్స్ ప్రకారం కూడా యజమానులందరికీ బాద్యతలు తప్పకుండా ఉంటాయి. ఈ చర్చలో వచ్చిన తీవ్రమైన పదాలు ప్రత్యేకంగా రుజువు చేయాలసిన అవసరం లేదు. రికార్డులు ఉంటాయి. చూడడానికి వీల్లేని భాగాలను తొలగించాల్సిందే. ఆ భాగాలనే కోర్టుకు విచారణ సమయంలో రికార్డులను అన్నమాటలన్నీ చెప్పడానికి ఇవ్వవలసి ఉంటుంది.
నేరారోపణాల సంగతి:
ఇవి నేరాలా, ఆరోపణలా? వివాదాస్పద వ్యాఖ్య ఎఫ్ ఐ ఆర్ స్థాయిలోనే ఉంది. ఇంకా పరిశోధన అవసరం. అందులో అరెస్టుకూడా జరుగుతుంది. అరెస్టు అంటే శిక్ష కాదు. అప్పడికే 14 రోజుల జైల్లోనో మరోచోటో విచారణ సాగుతుంటుందన్నమాట. అందుకోసం నిందితుడికి బంధించారు. ఈ పరిస్థితిలో కూడా బెయిల్ కోసం న్యాయవాదులను రంగంలో తీసుకువస్తారు. కింది కోర్టు నుంచి పై, పై కోర్టు దాకా తీసుకుపోతారు కూడా. ఆయా నిందితుల పెద్దతనాన్ని ఆధారంగా అన్ని స్థాయిలలో కేసులు కొనసాగుతూ ఉంటాయి.
ఎపి పోలీసులు కొమ్మినేని గారి వ్యాఖ్యలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. చార్జిషీట్ తయారు చేయడానికి చాలా అవసరం ఉంటుంది. ఈ కేసులో చట్టాలు, రూల్స్ లు, రకరకాల నిబంధనలు ఈవిధంగా ఉన్నాయి:
1. SC/ST అత్యాచారాల నిరోధక చట్టం, సెక్షన్ 3(1)(u) – అనుచిత వ్యాఖ్యల ద్వారా SC/STల పరువునష్టం, అవమానించారనే కేసు ప్రయోగించారు.
అయితే మంగళగిరి కోర్టు ఈ విషయంపై విచారణ చేస్తూ, SC/ST చట్టం ప్రయోగించడాన్ని ప్రశ్నించింది. ‘‘పోలీసులు తగిన ఆధారాలు లేకుండా ఆ సెక్షన్లను వాడతారా? కాని ప్రతిదానికీ ఈ చట్టాన్ని రంగంలోకి తెస్తారెండుకు’’ అని న్యాయాధికారి అన్నారని పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో పదేపదే రకాలుగా సైబల్ వీధిలో వీర విహారం చేస్తున్నాయి. కొమ్మినేని గారి తప్పు స్థాయి పెంచివేసారు. ఇతరులు మరీ మరీ ఈమాటలనే చెప్పడం వల్ల నేరం తీవ్రత అవుతుంది. నిందితుడికి పరువు తీసేయవచ్చా? మరి పోలీసుల దుర్వినియోగం వల్ల ఎస్ సి ఎస్ టి వారిని అవమానం చేసిన సందర్భం ఎక్కడ ఉంది? పోలీసుల పై చర్యలు చేస్తారా? అందుకు ఆదేశాలు ఇచ్చిన పై అధికారులకు, మంత్రులకు, పై పదవిలో ఉన్నవారికి బాద్యత లేదా? నిందితుడి వలెనే ఈ అధికారులకు ప్రభుత్వ అధికారులకు బాధ్యత వదిలేసినట్టు చర్యలు ఉండకూడదా? ఎస్ సి ఎస్టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని వాడుకుని కక్షకట్టి కేసులు సృష్టిస్తే SC/ST Prevention of Atrocities Act దుర్వినియోగం న్యాయమా? సెక్షన్ 3(1)(u) ప్రకారం, కులాన్ని బూతుగా లేదా అవమానంగా ప్రస్తావించడం నేరం. కానీ: ఇది ప్రత్యక్ష దూషణ, ప్రచురిత అవమానం వంటి నేరాలను ఈ చట్టాన్ని వాడుకోవచ్చు. కాని మామూలు రాజకీయ వ్యాఖ్యలను ఈ తప్పుడు కేసుతో చేర్చడం దుర్వినియోగమే.
2. కొత్త చట్టం (పాత ఐపిసి వంటిది): భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్లు:
o 79: మహిళా పరువునష్టానికి అభిమానందెబ్బతినే ఉద్దేశించిన చర్యలు
o 196: సమూహాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే చర్యలు
o 299, 356(2), 353(2), 61(1): వివిధ కలహాస్పద నేరాలు
3. 2000 నాటి ఐటీ చట్టం, (సవరణలతో కూడా) సెక్షన్ 67 – అశ్లీల పదార్థాలను ఎలక్ట్రానిక్ రూపంలో పంపించడం కూడా నేరమే. “Obscene or lascivious material” అనే పదబంధం అశ్లీల, లైంగిక చిత్రణల కోసం వాడాలి. ఒక రాజకీయ వ్యాఖ్యలపై ఇది ప్రయోగించడం చట్ట ఉల్లంఘన. దీన్ని దుర్వినియోగం తప్పు. ఒక టీవీ డిబేట్లో రాజకీయ వ్యాఖ్యలని అశ్లీలమైన నేరాలని శిక్షించాలనుకోవడం తప్పు కాదా?
పోలీసులు ‘రూల్స్’ ప్రయోగం: కంటెంట్ తొలగింపు: ప్రస్తుతం భారతదేశంలో మీడియా చట్టాలు, వాటి అమలు సరైన సమతుల్యత లేకుండా ప్రవర్తిస్తున్నాయి. 2021 విభిన్నసైబర్ రంగంలో మధ్యంతర నిబంధనలు (Intermediary Rules) ప్రకారం, సోషల్ మీడియా సంస్థలు (సంక్షిప్తంగా SSMIs అనవచ్చు): ఒక వేళ కేంద్ర ప్రభుత్వం అధికారులు పరిశీలించి అవి తప్పుడు మాటలు అని తేలితే వాటిని మొత్తం రికార్డులోనుంచి పూర్తిగా తొలగించాలి. మొదట ఈ మాటలను మీడియోలో వాడుకుంటున్న వారెవరు అని తెలుసుకునే టెక్నాలజీ అందరికీ తెలుసు. ఆ నేరాలన రుజువు చేయవచ్చు. చట్టం ప్రకారం నిర్ణయించిన నిర్దిష్ట కాల వ్యవధిలో ఇటువంటి మాటలు నేరారోపణలు అనే కంటెంట్ తొలగించాలి. రూల్స్ ప్రకారం ఇటువంటి సంఘటనలు జరిగిప్పుడు అపరాధం చేసిన వారికి పరిష్కారాలు చేసే గ్రీవెన్స్ అధికారిని నియమించాలి.
4. భారత న్యాయ సంహిత (BNS) – సెక్షన్ 153, 295: These relate to “promoting enmity” or “hurting religious sentiments.” చర్చలో విశ్లేషణాత్మక వ్యాఖ్యలు చేస్తే విద్వేష ప్రేరేపణ ఎలా అవుతుంది?
కొత్త నేరాల చట్టాలు: భావ స్వేచ్ఛపై నిబంధనలు: భారతీయ న్యాయ వ్యవస్థ కొత్తగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 153, 295 వంటి క్లాజులు — మత, కుల విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండొద్దని ఉద్దేశం. కానీ, ఇవే సెక్షన్లు వ్యూహాత్మకంగా వక్రీకరించి పత్రికలపై ప్రయోగించడమంటే ఇదే. నవ్తాజ్ జోహర్ vs Union of India (2018) కేసులో “ఒక వ్యక్తి భావాలు సమాజానికి నచ్చకపోయినా, అతని అభిప్రాయ హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత రాజ్యాంగానికి ఉంది” అని నిర్ణయించింది.
5. ఎథిక్స్ అని మనం అంటున్న నైతిక నియమాలనే ‘సామాజిక మీడియా’ నిబంధనలు, 2021 – ప్రకారం చర్చలో తప్పుడు మాటలని సమాచారాన్ని తొలగించాలనే బాధ్యత ఉంది. అయినా ఆ బాద్యతను గుర్తించలేదు. నిజానికి ఎథిక్స్ అనే నైతిక బాధ్యత వంటి దశదాటి అదే నేరమయ్యే చర్య అయింది.
మీడియా వేదికగా తిట్ల రాజకీయం
ఈ టీవీ డిబేట్ చర్చపై YSRCP మాజీ మంత్రి రజని తీవ్రంగా విమర్శించారు. రజనిగారు తన విమర్శ హక్కువాడుకోవచ్చు. విమర్శలేవీ ఉండకూడదంటే గొంతునొక్కడమే అవుతుంది అని రాజ్యాంగ హక్కు అని స్పష్టం గా ఉంది. “ఇది ప్రతిపక్షం జర్నలిస్టుల స్వేచ్ఛను గొంతునొక్కే ప్రయత్నం. మరోవైపు కృష్ణం రాజు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అయినా తప్పుడు కేవలం రాజకీయం కోసం అరెస్టు చేయడం దుర్మార్గం” అని ఆమె ప్రశ్నించారు.
ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అలపాటి సురేష్ కుమార్ మాత్రం మీడియా వ్యవస్థ నైతికంగా దిగజారుతుండడాన్ని బాధ పడ్డారు “ఒక పట్టణాన్ని వేశ్యల పట్నంగా అభివర్ణించడం సిగ్గుచేటు. విలేఖరి విలువలు పాటించేవారైతే ఇలాంటి సంఘటనలు జరగేవి కావు” అన్నారు.
ఎవరు బాధ్యులు?
సాక్షి పాత్రికేయుడి అరెస్టు, జైలు వ్యవహారంలో ఎవరి తప్పు అని ఏమిటో చూసేవారికి కనపడుతున్నా, లోతుగా పరిశీలిస్తేనే పరిష్కారాలు దొరకవు. మీడియా యాజమాన్యాలు విభిన్న పార్టీ రాజకీయాల వ్యూహాత్మకంగా ఎన్నికల్లో ఓడించడానికి గెలిపించుకోవడానికి పోటాపోటీలు నిర్వహిస్తున్నాయి, అవే పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. ఉదా. సాక్షి చానల్ YSR కుటుంబం ఆధ్వర్యంలో ఉంది, ఆ విధంగానే ABN, ETV వంటి వ్యాపార కార్పొరేట్ సంస్థలు TDP అనుబంధిత మీడియా సంస్థలుగా ప్రసిద్ధి చెందారు.
• ఎన్నికల్లో గెలవగానే పోలీసుల తీరు మారుతుంది. కులాల వారీగా పోలీసులు అధికారుల ‘అధికార పార్టీ’ అధికారి పార్టీ మార్పిడి జరుగుతుండడం మామూలే. ఫిరాయింపులు ఎక్కువవుతాయి. పోలీసులపై రాజకీయ ఒత్తిడి పెరుగుతూనే ఉంది. పోలీసులకు ఏమీ చేయలేమనే పరిస్థితి ఉంటుంది. ఏదైతేనే మంత్రిగారు, ఎస్ పి వంటి అధికారులు ఏవిధంగా ఆదేశిస్తే ఆ పని చేస్తే చాలు అని వదిలేస్తారు. అంటే పెద్దవారి నేరాలపై పరిశోధన, విచారణ కన్నా, అధికారిక ప్రకటనలు, లాభాలు, వ్యాపారాలు, రాజకీయాలకే విపరీత ప్రాముఖ్యత లభిస్తుంది.
• మహిళల గురించి దుర్మార్గంగా వ్యాఖ్యానించే అవమాన, లజ్జాకరమైన తప్పులే. కాని ఆ సెక్షన్ల వక్రీకరణం న్యాయమా, అసంబద్ధమైన సెక్షన్లు కక్షగట్టి, చట్టాన్ని వాడటం, కోర్టుల సమయాన్ని వృథా చేయడం నేరాలు కావా. ఆ నేరాలన్నీ వదిలేసి ఒక్క విలేఖరిని ముందుగా శిక్షించడమే గమ్యం, గతి. ఆ తప్పుకు ఎంత శిక్ష వేయాలో అంతగా తప్పుకుండా ఇవ్వాలి. ప్రభుత్వంలో ఉన్నాం కనుక ఏదైనా చేసుకుంటానంటే న్యాయం కాదు.
న్యాయ విద్యా, మీడియా విద్యాసంస్థల బాధ్యత
ఇటువంటి సందర్భాల్లో న్యాయవిద్యా సంస్థలు, జర్నలిజం కళాశాలలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత వహించాలి. స్వేచ్ఛా విలువలను అర్థం చేసుకుని, మీడియా స్వేచ్ఛను రక్షించేందుకు విద్యార్థులలో అవగాహన కల్పించాలి.
పరిష్కారాలేమయినా ఉన్నాయా?
స్వేచ్ఛపై గొంతు నొక్కే మరణఘంటికలు
ఒక్కోసారి ఇవి చట్టపరమైన గట్టి కేసులు అవుతాయి లేదా కేవలం నిబంధన మాత్రమే నైతికతగా ఉంటాయనుకుంటారు. కాని కఠినమైన చట్టబద్ధమైను తప్పులయిపోయి జైలుకు పంపే పరిస్థితులు ఉంటాయని న్యాయనిపుణులు హెచ్చరిస్తున్నారు. పత్రికా స్వాతంత్ర్యం అంటే ప్రభుత్వానికి, అధికార పార్టీకి ఇబ్బంది కలిగించే మాటలు చెప్పగలిగే హక్కు.
ఈ మధ్య వంగ్యంగా విమర్శించే కామెడియన్ కునాల్ కామ్రా బాంబే హైకోర్టు కు రిట్ పిటిషన్ వేసారు. దానిపై వాదిస్తూ, “ఈ నిబంధనలు మాటల స్వేచ్ఛపై గొంతు నొక్కే మరణఘంటికలు మోగిస్తున్నాయి. ఇటువంటి వ్యంగ్య హాస్య విమర్శలను నిందలుగా మార్చి, నేరాలుగా కేసులు పెడుతూ ఉంటే అదే తప్పుడు సమాచారం అంటూ ఉంటే, ఇక సమాజంలో, మన ప్రజాస్వామ్యంలో ఎటువంటి విమర్శలూ వంగ్యాస్త్రాలు ఉండవు. జైళ్లు నోళ్లను మూసేస్తారు. ఏమాటలూ వినబడవు.” ఈ కేసులో నిందితులకు అదృష్టం అనుకుంటూ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చి హాస్యాన్ని వంగ్యాన్ని బతికించారు
రాజకీయ ప్రతీకార వ్యూహమా?
పత్రికారచయితలు తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తీకరించడాన్ని, వ్యతిరేక పక్షాల హక్కుల నష్టంగా చూపించడం, స్వేచ్ఛ మీద కమ్ముకున్న ప్రమాదం. రాజకీయంగా ప్రేరణతో పెట్టిన కేసులు ప్రభుత్వ, పోలీసుల ఉద్దేశ్యాన్ని శంకించేపనిలో ఉన్నాయి. ఇది పత్రికా స్వేచ్ఛ, న్యాయ పరిరక్షణ, కొందరికి అధికార పార్టీ రాజకీయపరమైన అన్యాయం, మాజీ అధికార రాజకీయ పార్టీకి మద్దతు. ఒకటి రెండు సంఘటనలకు అభ్యంతరాలనే వంటి అనేకానేక అన్నింటినీ సమాజాన్ని ప్రభావితం చేసే ఘట్టం.
• ఇందులో సుప్రీంకోర్టు తీర్పులు Hitesh Verma v. State of Uttarakhand, (2020) 10 SCC 710 “Private disputes without caste-based intent do not fall under SC/ST Act.” చూడాలి.
• మరికొన్ని తీర్పులు: Manzar Sayeed Khan v. State of Maharashtra, (2007) 5 SCC 1, "Criticism of religion, caste, or ideology in the context of political discourse does not qualify as incitement."
• అభిప్రాయ స్వేచ్ఛపై కొన్ని మినహాయింపులు రక్షణలు ఉన్నాయి. శ్రేయా సింగల్ వి. యూనియన్ ఆఫ్ ఇండియా (2015) 5 SCC 1: “భావ స్వేచ్ఛ రాజ్యాంగంలో Article 19(1)(a) కింద ఉంది. దీన్ని అస్పష్టమైన vague lawsతో భావస్వేచ్ఛను తగ్గించలేరు.”
• “పత్రిక స్వాతంత్ర్యం లేకుండా ప్రజాస్వామ్యం నిష్క్రియంగా మారుతుంది.” — డాక్టర్ బీఆర్ అంబేద్కర్
• Ethics: Press Council of India Norms of Journalistic Conduct (2022 edition), Chapter 1. Section 2(1): “A journalist has the right to criticize policies, governments, political parties, but must avoid malice and incitement.” Section 3(4): “Freedom of the press is not just the freedom to publish, but also includes the freedom to think, question, and analyze.” Section 4(2): “In political coverage, use of strong words or sarcasm is permissible, as long as there is no intent to defame personally or incite violence.”
• వినోద్ దువా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు తీర్పు 2021: “సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యలను దేశద్రోహంగా చూడటం అనుచితమని న్యాయస్థానం తేల్చింది.”
• ❝ భారత రాజ్యాంగం గౌరవించే Article 19(1)(a) హక్కు – భావ స్వేచ్ఛ – అపరిమితం కాదు. కానీ అది భయపడి మౌనం వహించాల్సిన హక్కు కాదు. ❞ — సుప్రీంకోర్టు, 2021
యాంకర్ మాత్రమే కాదు, ప్రతి చర్చలోపాల్గొనే రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ కొత్త నేర చట్టాలను కూడా గుర్తించి నేరాలకు, పోలీసులతో అవసరం లేని, టివిలలో సమావేశాలలో ఇటువంటి అవకాశం లేని నిర్మాణాత్మక విమర్శ చేసుకుని చర్చలో జర్నలిస్టులు ఇతర పెద్దలు మాట్లాడడం అవసరం.