Judgment | మదనపల్లె:కోర్టు సంచలన తీర్పు.. నలుగురికి జీవితఖైదు

హత్య కేసులో 11 ఏళ్ల విచారణ తరువాత జడ్జి తీర్పు చెప్పారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు మరణించడం గమనార్హం.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-03-28 14:14 GMT

మదనపల్లె  రెండవ అదనపు జిల్లా జడ్జి శుక్రవారం సంచలన తీర్పు వెలువరించారు. ఓ హత్య కేసులో నలుగురికి జీవితఖైదు పడడం ఇదే ప్రథమం. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు మరణించారు. మిగతా నలుగురు నిందితులపై కేసు విచారణ జరిగింది.


మదనపల్లెలో పూల వెంకటాచలపతిని చంపిన నలుగురికి జీవిత ఖైదీ విధిస్తూ మదనపల్లె ఏడీజే కోర్టు జడ్జి బి. అబ్రహం శుక్రవారం సంచలన తీర్పు చెప్పారు. స్థానిక చంద్రకాలనీకి చెందిన పూల వెంకటాచలపతిని 2014 ఆగష్టు 16వ తేదీ ధనేశ్వరరెడ్డి, అనుచరులు మంజు, కిషోర్, గంగాధర్, మల్లికార్జున, సురేందర్ రెడ్డి హత్యచేశారు. ఈ కేసును మదనపల్లెలో అప్పటి 2టౌన్ సిఐ గంగయ్య కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు. సుమారు 11ఏళ్ళపాటు కోర్టులో కేసు విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి బీ. అబ్రహం తీర్పు చెప్పారు. నిందితులకు రూ. 20 వేలు జరిమానా కూడా విధించారు. కాగా, నిందితుల్లో ధనేశ్వరరెడ్డి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురి కాగా, మంజు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మిగిలిన నలుగురిని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆరోగ్య పరీక్షల అనంతరం పోలీసులు జైలుకు తరలించారు.

ఈ కేసు వివరాలు ఇవి

మదనపల్లి పట్టణం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రాకాలనీలో 2014 ఆగష్టు 16వ తేదీ పూల వెంకటాచలపతి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై చలపతి భార్య పూల జ్యోతి ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ సీఎం. గంగయ్య క్రైమ్ నంబర్ 179/2014 U/S.120(B)302.109.r/w34 IPC. SCNO. 126/2016 కేసు నమోదు చేశారు. పూల వెంకటాచలపతిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు ధనేశ్వరరెడ్డికి పాతకక్షలతో అతని అనుచరులు, రామిశెట్టి కిషోర్ (33) దాసారు గంగాధర్ (30), నాగ తాత గారి మల్లికార్జున (35), మలిగి సురేంద్ర రెడ్డి ( మెస్ సూరి) చంద్రకాలనీలో స్టోర్ వీధిలో ఉండగా పూల వెంకటాచలపతిని హత్య చేశారు. మృతుడి భార్య పూల జ్యోతి ఫిర్యాదు ఆధారంగా నిందితులను అరెస్టు చేసిన మదనపల్లె టూ టౌన్ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.
మదనపల్లి కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. పూల చలపతి హత్యకేసులో రెండవ అదనపు జిల్ జడ్జి నిందితులకు జీవిత ఖైదు తో పాటు ఒక్కొక్కరికి 20 వేలు జరిమానా విధించారు.
ఈ కేసులో ప్రధాన నిందితులు ధనేశ్వరరెడ్డి. 2021లో తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురయ్యాడు. A3 నిందితుడిగా ఉన్న అమరనాథ్ 2017లో ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలో హత్కు గురైనట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో జీవితఖైదు శిక్ష పడిన మిగతా ఇద్దరు నిందితులను పోలీసులు జైలుకు తరలించారు.
హత్యకేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులను అన్నమయ్య జిల్లా ఎస్పీ వి. విద్యాసాగరనాయుడు అభినందించారు. మదనపల్లి డీఎస్పీ డి.కొండయ్య నాయుడు, టూ టౌన్ సీఐ కె.రామచంద్ర, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) వి. జయనారాయణరెడ్డి, కోర్టు లైజన్ ఆఫీసర్ జి.సతీష్ కుమార్, కోర్ట్ హెడ్ కానిస్టేబుల్ పి.వి.బాలసుబ్రహ్మణ్యంను అభినందించారు.

Similar News