ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

Update: 2024-05-12 23:58 GMT
Live Updates - Page 8
2024-05-13 04:54 GMT

 ఓటు హక్కు వినియోగించుకున్న గౌతు శిరీష

పలాస నియోజకవర్గం ఎన్డీఏ కూటమి పలాస నియోజకవర్గ అభ్యర్థి గౌతు శిరీష పలాస శాసనంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

2024-05-13 04:52 GMT

మంగ‌ళ‌గిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. తన సతీమణితో కలిసి ఓటు వేశారు.


2024-05-13 04:39 GMT

ఉదయం 9 గంటలకు వరకు ఎన్‌టీఆర్ జిల్లాలో 8.95 శాతం పోలింగ్ నమోదయింది. విజయవాడ ఈస్ట్‌లో అత్యధికంగా 12శాతం పోలింగ్ నమోదైంది.

2024-05-13 04:16 GMT

ఐకాన్న స్టార్ అల్లూ అర్జున్.. జూబ్లీహిల్స్‌లో ఓటు వేశారు. అనంతరం నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘‘నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం నాకు లేదు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి’’ అని కోరారు.

2024-05-13 04:06 GMT

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కాకాణి.... నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు .సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, తోడేరు గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

2024-05-13 04:05 GMT

నెల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ స్థానం నుంచి ఆనం రామనారాయణరెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సోమవారం ఉదయం ఆయన నెల్లూరు నగరం సంతపేటలోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.


2024-05-13 04:03 GMT

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మొరాయించిన ఈవీఎం


చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్లో ఉన్న 103 వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పని చేయడం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పనిచేయక పోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పొద్దున 7 లకే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నప్పటికీ నిరీక్షణ తప్పడం లేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అర్థగంట సేపు మాత్రమే ఈవీఎం పని చేసిందని, అనంతరం ఈవీఎం మోరాయించ డంతో గంటన్నర నుంచి నిరీక్షిస్తున్నట్లు ఓటర్లు తెలిపారు.

2024-05-13 03:53 GMT

అబ్దుల్లాపూర్ మెట్టు మండలం పసుమాముల గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నా భువనగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్

2024-05-13 03:51 GMT

తిరుపతి అసెంబ్లీ స్థానంలో ఉన్న జగన్మాత చర్చి సమీపంలోని పోలింగ్ కేంద్రంలో దొంగ ఓటర్లను పట్టుకున్న బిజెపి నాయకులు. ఐదుగురు దొంగ ఓటర్లను గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఉదయమే దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించడంపై బీజేపీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2024-05-13 03:49 GMT

వైయస్సార్సీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీ శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని), తన కుటుంబ సభ్యులతో కలిసి తూర్పు నియోజకవర్గం, 29, 30 బూత్ లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు

Tags:    

Similar News