అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మొరాయించిన... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మొరాయించిన ఈవీఎం


చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్లో ఉన్న 103 వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పని చేయడం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పనిచేయక పోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పొద్దున 7 లకే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నప్పటికీ నిరీక్షణ తప్పడం లేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అర్థగంట సేపు మాత్రమే ఈవీఎం పని చేసిందని, అనంతరం ఈవీఎం మోరాయించ డంతో గంటన్నర నుంచి నిరీక్షిస్తున్నట్లు ఓటర్లు తెలిపారు.

Update: 2024-05-13 04:03 GMT

Linked news