యుద్దం సమయంలో ఇంధన కొనుగోళ్ల విషయంలో భయాందోళనలు వద్దంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. తమ అన్ని ఔట్లెట్స్లో ఎల్పీజీ, ఫ్యూయల్ అందుబాటులో ఉందని చెప్పింది. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటం మంచిదని సూచించింది.
#IndianOil has ample fuel stocks across the country and our supply lines are operating smoothly.
— Indian Oil Corp Ltd (@IndianOilcl) May 9, 2025
There is no need for panic buying—fuel and LPG is readily available at all our outlets.
Help us serve you better by staying calm and avoiding unnecessary rush. This will keep our…
పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లిస్తుంది: జమ్మూకశ్మీర్ కాంగ్రెస్
భారత్పై పాకిస్థాన్ చేసిన దాడులను జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్ను టార్గెట్గా చేసిన దాడులకు పాకిస్థాన్ తగిన మూల్యం చేల్లిస్తుందని వ్యాఖ్యానించింది. ‘పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలను జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది’’ అని తెలిపింది.
భారత సైన్యానికి సంఘీభావంగా కాంగ్రెస్ తిరంగ యాత్ర ర్యాలీని నిర్వహించింది.
భారత సైన్యానికి మద్దతుగా తమిళనాడు ర్యాలీ
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థుతులు నెలకొన్న క్రమంలో ఇండియా సైన్యానికి మద్దతుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. "భారత సైన్యానికి మద్దతుగా రేపు చెన్నైలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ర్యాలీ జరుగుతుంది. పాకిస్తాన్ దురాక్రమణ మరియు ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి ఐక్యత మరియు మద్దతును వ్యక్తపరచడానికి ఇది ఒక క్షణం. సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ ర్యాలీ, భారత సైన్యం యొక్క శౌర్యం మరియు త్యాగాలను గౌరవించడం మరియు జాతీయ ఐక్యతను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ర్యాలీలో పాల్గొనాలని ముఖ్యమంత్రి తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు" అని ఎంకే స్టాలిన్ వెల్లడించారు.
పాకిస్థాన్తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఉన్న కేరళ ప్రజల కోసం ఆ రాష్ట్రం ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా అక్కడ ఉన్నవారి యోగక్షేమాలను తెలుసుకోనుంది. వారిని వీలైనంత త్వరగా సొంత రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. ఉరిని సందర్శిస్తున్నారు. అక్కడి సైనికులను కలిసి వారి పరిస్థితులను, స్థానిక వాతావరణాన్ని సమీక్షించనున్నారు.
పశ్చిమ సరిహద్దు వెంబడి ఉన్న ప్రదేశాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన విఫల ప్రయత్నాల దృష్ట్యా ఇండియా గేట్ చుట్టూ భద్రతను పెంచారు.
భారత్పై దాడి చేసే దమ్ము పాక్కు లేదు: షిండే
ఆపరేషన్ సింధూర్పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పాకిస్తాన్కు భారతదేశంపై దాడి చేసే ధైర్యం లేదు. భారతదేశం మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దానికి గుణపాఠం నేర్పించారు. ఈ సమయంలో అది భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే, మన సాయుధ దళాలు పాకిస్తాన్ను తుడిచిపెడతాయి మరియు పాకిస్తాన్ మ్యాప్లో కనిపించదు... ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. పాకిస్తాన్ చాలా తెలివిగా ఉండటానికి ప్రయత్నిస్తే, దానికి తగిన సమాధానం వస్తుంది. మన సాయుధ సైనికులు ఏ పౌరులపైనా దాడి చేయలేదు. వారు ఈ ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే నాశనం చేశారు మరియు వారికి గుణపాఠం నేర్పించారు" అని అన్నారు.
భారత్పై దాడి చేసే దమ్ము పాక్కు లేదు: షిండే
ఆపరేషన్ సింధూర్పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పాకిస్తాన్కు భారతదేశంపై దాడి చేసే ధైర్యం లేదు. భారతదేశం మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దానికి గుణపాఠం నేర్పించారు. ఈ సమయంలో అది భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే, మన సాయుధ దళాలు పాకిస్తాన్ను తుడిచిపెడతాయి మరియు పాకిస్తాన్ మ్యాప్లో కనిపించదు... ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. పాకిస్తాన్ చాలా తెలివిగా ఉండటానికి ప్రయత్నిస్తే, దానికి తగిన సమాధానం వస్తుంది. మన సాయుధ సైనికులు ఏ పౌరులపైనా దాడి చేయలేదు. వారు ఈ ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే నాశనం చేశారు మరియు వారికి గుణపాఠం నేర్పించారు" అని అన్నారు.
భారత్తో జరుగుతున్న యుద్ధాన్ని ఆసరగా తీసుకుని దాడులు ప్రారంభించిన బలూచీలు. పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఫ్రంట్. భారత్ దాడులను హైలెట్ చేస్తున్న బలూచ్ రేడియో.