ఆరోసారి అమలు చేయలేమంటూ చేతులెత్తేసిన కర్ణాటక..

పశ్చిమ కనుమలు కస్తూరిరంగన్ సిఫార్సులను అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలంటూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి..

By :  491
Update: 2024-10-01 09:46 GMT

పశ్చిమ కనుమలను కాపాడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కే. కస్తూరి రంగన్ ఇచ్చిన నివేదికను తాము అమలు చేయబోమని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పశ్చిమ కనుమల ప్రాంతాన్ని సంరక్షించడానికి కస్తూరి రంగన్ కమిటీ నివేదికను అమలు చేయాలని కోరుతూ ఆరవ సారి నోటిఫికేషన్ జారీ చేసింది. తాము ఇంతకుముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని కర్ణాటక తెలిపింది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

కస్తూరిరంగన్ నివేదిక పశ్చిమ కనుమలలోని మండలాలను పర్యావరణ సున్నిత ప్రాంతాలుగా గుర్తించాలని సిఫార్సు చేసింది. “ డాక్టర్ కె కస్తూరిరంగన్ కమిటీ నివేదిక సిఫార్సులను తిరస్కరించాలని కర్ణాటక ప్రభుత్వం సిఫార్సు చేసింది. దీని దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం 2024 జూలై 31 నాటి నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తోంది” అని అదనపు చీఫ్ నుంచి కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి లీనా నందన్‌కు లేఖ రాశారు. కార్యదర్శి (అడవులు, జీవావరణ శాస్త్రం, పర్యావరణం) ఎన్ మంజునాథ్ ప్రసాద్ లేఖ రాశారు.
తిరస్కరణలే తిరస్కరణలు..
కేరళలోని వాయనాడ్‌లో ఘోరమైన కొండచరియలు విరిగిపడిన తరుణంలో, కర్నాటక కూడా ఇదే తరహ సమస్యలను ఎదుర్కొంటుంది. మార్చి 2014, సెప్టెంబర్ 2015, ఫిబ్రవరి 2017, అక్టోబర్ 2018, జూలై 2022, జూలై 2024లో కేంద్రం ఆరుసార్లు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, తమిళనాడుతో సహా పశ్చిమ కనుమలలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోసారి సిఫార్సులను తిరస్కరించాలని నిర్ణయించాయి.
నివేదిక సిఫార్సులను తిరస్కరిస్తూనే, కర్ణాటక ప్రభుత్వం పశ్చిమ కనుమలలోని విస్తారమైన ప్రాంతాలను పర్యావరణపరంగా సున్నితమైనవిగా ప్రకటించి, తదనుగుణంగా చర్యలు తీసుకుంటే "33 తాలూకాలు.. 10 జిల్లాల్లోని 1,499 గ్రామాలలో నివసిస్తున్న లక్షలాది మందికి కష్టాలు ఏర్పడతాయి" అని పేర్కొంది.
ప్రస్తుత ఆంక్షలు, వారి జీవనోపాధిపై ప్రభావం గురించి స్థానికులు తమ ఫిర్యాదులను వినిపించారని లేఖలో పేర్కొన్నారు. నివేదిక అమలులో స్థానిక ప్రజలు ఇష్టపూర్వకంగా పాల్గొంటే తప్ప, చర్యలు "ప్రతిఫలితం"గా ఉంటాయని ప్రభుత్వం వాదించింది.
కస్తూరిరంగన్ కమిటీ నివేదిక
ఆగస్టు 2012లో ఏర్పాటైన కస్తూరిరంగన్ కమిటీ, పశ్చిమ కనుమలలో 60 శాతం మానవ నివాసాలు, వ్యవసాయం, తోటలను కలిగి ఉన్నాయని, మిగిలిన 37 శాతం జీవశాస్త్రపరంగా గొప్ప సహజ ప్రకృతి ప్రాంతంగా ఉండాలని నివేదిక ఇచ్చారు
కమిటీ పశ్చిమ కనుమల మొత్తం వైశాల్యంలో 37 శాతం (లేదా 60,000 చ.కి.మీ) - "జీవశాస్త్రపరంగా సంపన్న ప్రాంతం" అని పిలిచే దానిని పర్యావరణపరంగా సున్నితమైనదిగా ప్రకటించాలని ప్రతిపాదించింది. మైనింగ్, క్వారీయింగ్, రెడ్ కేటగిరీ పరిశ్రమలు, థర్మల్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై నిషేధం ఇతర కఠిన చర్యలను ప్రతిపాదించింది.
పశ్చిమ ఘాట్ ప్రాంతంలోని 75 శాతం లేదా 129,037 చ.కి.మీ ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించిన మాధవ్ గాడ్గిల్ కమిటీ సిఫార్సులను మొత్తం ఆరు రాష్ట్రాలు తిరస్కరించడంతో కస్తూరిరంగన్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, పశ్చిమ కనుమలు వినాశకరమైన పర్యావరణ నష్టాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, రాష్ట్రాలు పదే పదే కస్తూరిరంగన్ కమిటీ నివేదికను తిరస్కరించాయి.


Tags:    

Similar News