అనవసర సమస్యలు సృష్టించొద్దు: మల్లికార్జున్ ఖర్గే

కర్ణాటకలో నాయకత్వ మార్పు పై శ్రేణులకు హితబోధ చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు, వ్యంగ్యంగా స్పందించిన తేజస్వీ సూర్య;

Update: 2025-06-30 13:52 GMT
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు గురించి కాంగ్రెస్ నాయకుల మధ్య బహిరంగం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.

అలాంటి నిర్ణయాలు పార్టీ హైకమాండ్ తీసుకుంటుందని, అనవసరమైన సమస్యలు సృష్టించవద్దని నాయకులను కోరారు. ఈ ఏడాది అక్టోబర్ లో నాయకత్వ మార్పు జరగవచ్చని కొందరు కాంగ్రెస్ నాయకులు చేసిన వాదనలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

‘‘చూడండి ఈ నిర్ణయం హై కమాండ్ చేతిలో ఉంది. అక్కడ ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇది పూర్తిగా వారి ఇష్టం. తదుపరి చర్యలు తీసుకునే అధికారం వారికి ఉంది.
కానీ అనవసరమైన సమస్యలు సృష్టించాల్సిన అవసరం లేదు.’’ అని ఆయన బెంగళూర్ లో విలేకరులతో అన్నారు. కర్నాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ను నియమిస్తారనే ఊహాగానాలు వస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అయితే నాయకత్వ మార్పు ఉండదని మాత్రం చెప్పకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
స్పందించిన తేజస్వీ సూర్య..
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య స్పందించారు. ‘‘ ఈ కనిపించని, వినిపించని హై కమాండ్ ఎవరూ’’? కాంగ్రెస్ అధ్యక్షుడు కాకపోతే ఎల్లప్పుడూ అనుభూతి చెందే ఈ హై కమాండ్ ఎవరు అని సూర్య ప్రశ్నించారు.
‘‘కాంగ్రెస్ హై కమాండ్ ఒక దెయ్యం లాంటిది. అది కనిపించదు. వినబడదు. కానీ ఎల్లప్పుడూ అనుభూతి చెందుతుంది. ప్రజలు హై కమాండ్ అని భావించిన కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా దానిపేరు గుసగుసలాడుతూ అది తాను కాదని అంటున్నారే. ఇది చాలా వింతగా ఉంది’’ అని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.
సిద్దరామయ్య, శివకుమార్ ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనే వాదనల మధ్య కాంగ్రెస్ పార్టీ స్పందించే విధానంలో హైకమాండ్ పదం వినిపిస్తుంది. ఫిబ్రవరిలో నాయకత్వ మార్పుపై ఊహగానాల గురించి అడిగినప్పుడూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఇలాంటి సమాధానమే ఇచ్చారు. ‘‘అది హై కమాండ్ నిర్ణయిస్తుంది’’ అని అన్నారు.
ఏప్రిల్ లో శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే బసవరాజ్ శివగంగ, డిసెంబర్ నాటికి సిద్దరామయ్యను మార్చాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. అంతర్గత వివాదాలను బహిరంగంగా మాట్లాడకూడదని హైకమాండ్ ఆదేశించినప్పటికీ ఆయన ప్రకటన రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న ఆధిపత్య, వర్గపోరును సూచిస్తుంది.
బెంగళూర్ కు సుర్జేవాలా..
కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ సుర్జేవాలా ప్రస్తుతం బెంగళూర్ లో దాదాపు వందమంది ఎమ్మెల్యేలతో ప్రయివేట్ సమావేశాలు నిర్వహిస్తున్నాడు. దీనిని నష్ట నివారణ చర్యలుగా పలువురు విశ్లేషకులు చెబుతున్న మాట.
2023 లో కాంగ్రెస్ కర్ణాటకలో అధికారం చేపట్టిన తరువాత సిద్దరామయ్య, డీకే శివకుమార్ లు చెరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని ఊహగానాలు వచ్చాయి.
అయితే ఈ ఫార్ములాను ఇప్పటి వరకూ ఎవరూ ధృవీకరించలేదు. అలా అని ఎవరూ తిరస్కరించలేదు. ప్రస్తుతం సిద్దరామయ్య ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నారు. శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.


Tags:    

Similar News