రాహుల్ డిమాండ్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఓకే చేస్తారా?

రాయ్‌బరేలీ ప్రజల చిరకాల డిమాండ్‌ ఏమిటి?;

Update: 2025-09-05 07:42 GMT
Click the Play button to listen to article

కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌(Ashwini Vaishnaw)కు లేఖ రాశారు. దిబ్రూగఢ్‌-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ (Rajdhani Express) ట్రైన్‌ను రాయ్‌బరేలీ జంక్షన్‌లో ఆపాలని అందులో కోరారు. తన నియోజకవర్గ ప్రజలు దేశ రాజధానికి వెళ్లేందుకు వీలుగా రాయ్‌బరేలీ మీదుగా వైళ్లే రైళ్లను (నంబర్లు 20503/20504, 20505/20506) ఆపాలని లెటర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

"ఈ విషయాన్ని నా పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాని స్పందించలేదు. ఇకనైనా వారి డిమాండ్‌ను నెరవేరుస్తారని ఆశిస్తున్నా’’ అని సెప్టెంబర్ 3న రైల్వే మంత్రికి రాసిన లేఖలో కోరారు. 

Tags:    

Similar News