ఎయిర్ ఇండియా సిబ్బందిపై వేటు

ఆ ముగ్గురిని తొలగించాలని ఆదేశించిన DGCA..;

Update: 2025-06-21 11:32 GMT

ఎయిర్ ఇండియా(Air India) ఇబ్బందుల్లో పడింది. టాటా గ్రూప్(Tata Group) యాజమాన్యంలోని ఎయిర్‌లైన్స్‌కు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులను తొలగించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) ఆదేశించింది. విమాన సిబ్బంది షెడ్యూలింగ్‌కు సంబంధించి పదేపదే తప్పిదాలు చేయడంతో డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ చూరా సింగ్, క్రూ షెడ్యూలింగ్ డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్‌లో చీఫ్ మేనేజర్ పింకీ మిట్టల్, క్రూ షెడ్యూలింగ్ – ప్లానింగ్ పాయల్ అరోరాపై చర్య తీసుకోవాలని కోరింది.

కాగా డీజీసీఏ ఆదేశాలను పాటిస్తామని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని చెప్పారు. భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిముషాల్లోనే కూలిపోయిన ఘటనలో మొత్తం 241 మంది సజీవ దహనమయిన విషయం తెలిసిందే. ఒక్క ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఒక మెడికల్ కాలేజీ బిల్లింగ్‌పై కూలిపోవడంతో ఐదుగురు వైద్య విద్యార్థులతో పాటు 29 మంది స్థానికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎయిర్ ఇండియా మృతుల కుటుంబాలకు ఒక్కొ్క్కరికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News