ఏపీ వ్యవసాయం దిశానిర్దేశం మారుతుందా?
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో నూతన దిశానిర్దేశం జరిగింది. డా. మనజిర్ జిలానీ సమూన్ బాధ్యతల స్వీకారంతో రిఫార్మ్స్కు శ్రీకారం చుట్టారు. ఇది ఏమేరకు సక్సెస్ అవుతుంది?
ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐఏఎస్ ల బదిలీల్లో భాగంగా వ్యవసాయ శాఖ కు నూతన సంచాలకులుగా డా. మనజిర్ జిలానీ సమూన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఆదేశాలు, ప్రణాళికలు రాష్ట్ర వ్యవసాయ రంగానికి కొత్త ఆవిష్కరణలు చేపడతాయా? అనే ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు డిజిటల్ సాంకేతికత, ప్రెసిషన్ అగ్రికల్చర్, (భారత్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN), డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద ప్రెసిషన్ ఫార్మింగ్ ప్రోత్సహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్లతో నానో ఎరువులు చల్లడం వంటి పైలట్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి) సులభంగా ఎరువుల పంపిణీ వంటి కీలక మార్పులు రాబోతున్నాయి. ఇది రైతుల సంక్షేమానికి, ఉత్పాదకత పెంపునకు దోహదపడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
డాక్టర్ సమూన్ వ్యవసాయాన్ని పండుగ చేస్తారా?
డా. సమూన్, గతంలో AP మార్క్ఫెడ్ MDగా పనిచేసారు. ఇటీవల 29 మంది IAS ఆఫీసర్ల రీషఫుల్లో వ్యవసాయ డైరెక్టర్గా నియమితులయ్యారు. అదనంగా AP స్టేట్ అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ VC & MDగా FAC కూడా చేపట్టారు. ఈ అపాయింట్మెంట్ రాష్ట్ర వ్యవసాయ శాఖను మరింత డైనమిక్గా మారుస్తుందా? లేదా? అనే సందేహాలు కూడా పలువురిలో ఉన్నాయి. ఎందుకంటే ముఖ్య మంత్రి దృష్టి వ్యవసాయం కంటే పారిశ్రామిక రంగంపై ఎక్కువగా ఉంది. మంగళవారం బాధ్యతలు తీసుకున్న వెంటనే నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన రబీ సీజన్ నుంచి యూరియా పంపిణీని సులభతరం చేసేలా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గత సీజన్లో ఎదురైన సమస్యలు, ప్రతిష్టంభనలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇది ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, ఆలస్యాలను తగ్గించి, రైతులకు సకాలంలో అందుబాటు పెంచుతుంది.
ఏపీ వ్యవసాయ రంగం ఎదుర్కొటున్న సమస్యలపై డైరెక్టర్ సమీక్ష
వ్యవసాయ డిజిటల్ ప్లాట్ఫారమ్లు పనిచేస్తున్నాయా?
డి కృషి (D-Krishi) యాప్, ఈ పంట (Ee Panta / e-Panta) యాప్, ఎజైల్ (eGAIL) యాప్, ఎజైల్ (eGAIL) యాప్, AP AIMS 2.0 (Andhra Pradesh Agriculture Information Management System 2.0) వంటి యాప్ లు రైతులకు డోర్స్టెప్ సేవలు అందించి, ఖర్చులు తగ్గించి, దిగుబడి పెంచుతున్నాయి. ఈ యాప్ల అమలులో ఎదురవుతున్న సమస్యలపై కూలంకషంగా చర్చించారు. ఇది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేసి, క్షేత్రస్థాయి అధికారులకు, రైతులకు సులభమైన ఇంటర్ఫేస్ అందించనుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు నూతన సాంకేతికతల వినియోగం ముఖ్యమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. డ్రోన్ల ద్వారా నానో ఎరువులు, పురుగు మందులను అవసరమైన మేరకే వినియోగించే ప్రెసిషన్ వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. పైలట్ పథకంగా కొన్ని ప్రాంతాల్లో డిజిటల్ వ్యవసాయ సాంకేతికతలను ప్రవేశపెట్టి, ఫలితాలను పరిశీలించాలని సూచించారు. ఇది వ్యవసాయ ఖర్చులు తగ్గించి, పర్యావరణ సంరక్షణకు దోహదపడుతుంది. దీర్ఘకాలంలో రైతుల ఆదాయాన్ని పెంచుతుంది.
పంట దిగుబడి, అంచనాల నమోదు జరుగుతోందా?
పంటల విస్తీర్ణం, దిగుబడి అంచనాల నమోదును అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి, వివరాలు సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. పంటల కొనుగోలు సమయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇది మార్కెట్ లింకేజీలను మెరుగు పరచి, రైతులకు న్యాయమైన ధరలు అందేలా చేస్తుంది. అలాగే పంటల భీమా అమలులో దిగుబడి నిర్ధారణకు పంట కోత ప్రయోగాలను నిర్దేశిత సమయంలో చేపట్టాలని ఆదేశించారు. రైతు భాగస్వామ్య సంస్థలు (FPOలు)ను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. ఇది రైతులను సమూహాలుగా ఏర్పాటు చేసి, వారి బార్గైనింగ్ పవర్ పెంచుతుంది. అంటే ఇప్పటి వరకు పనిచేసిన అధికారులు కానీ, వారిని నడిపించిన పాలకులు కానీ సరైన పద్ధతుల్లో పనిచేయలేదని ప్రస్తుత డైరెక్టర్ భావిస్తున్నారా? అనే చర్చ కూడా ఉద్యోగులు, అధికారుల్లో మొదలైంది.
ఎరువుల పంపిణీకి సాఫ్ట్ వేర్ పనిచేస్తోందా?
రబీ సీజన్ నుంచి ఎరువుల పంపిణీకి ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పనపై ఆరా తీశారు. ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (Integrated Fertilizer Management System – IFMS) లో ఎరువుల నిల్వలను రియల్ టైమ్లో ప్రతిబింబించేలా క్షేత్రస్థాయి అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. మూస ధోరణిని విడిచిపెట్టి, యూరియా పంపిణీ సులభతరం చేసేలా మేధోమథనం చేపట్టాలని ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల సిబ్బందికి లాగిన్లు, బయోమెట్రిక్ డివైస్ల వాస్తవ పరిస్థితులను పరిశీలించి, రాబోయే రోజుల్లో ఎరువుల పంపిణీలో ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇవన్నీ మొత్తంగా వ్యవసాయ శాఖను మరింత సమర్థవంతంగా, రైతు-కేంద్రీకృతంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాయి అని డైరెక్టర్ భావిస్తున్నారా? అనే సందేహాలు కూడా పలువురిలో ఉన్నాయి.
వ్యవసాయ శాఖ డిజిటలైజేషన్, సాంకేతికత వినియోగం, సమస్యల పరిష్కారం వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి తరచూ సమీక్షలు జరుపుతున్న నేపథ్యంలో సిబ్బంది నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించాలని ఆదేశించడం గమనార్హం. ఈ మార్పులు అమలైతే, రాష్ట్ర వ్యవసాయ రంగం ఆధునికీకరణ దిశగా ముందడుగు వేసి, రైతుల సంక్షేమానికి బలమైన పునాది వేస్తుంది. ఇది కేవలం ఆదేశాలుగానే కాకుండా, ఆచరణలోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.