శభాష్ సీదిరి..ప్రాణాలు కాపాడావు
కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్వయంగా వైద్య సేవలు అందించారు.
By : Vijayakumar Garika
Update: 2025-11-02 05:46 GMT
"వైద్యో నారాయణో హరి" అనే పురాణ మంత్రానికి నిజమైన ఉదాహరణగా మారిన మాజీ మంత్రి, వైసీపీ నేత, డాక్టర్ సీదిరి అప్పలరాజు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట ఘటనలో కీలక పాత్ర పోషించారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న సీదిరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన భక్తులకు స్వయంగా సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేసి, ఆక్సిజన్ సప్లై అందించే ప్రయత్నం చేశారు. ఈ చర్యల వల్ల ఇద్దరు భక్తుల ప్రాణాలు కాపాడినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించి, స్థానిక వైసీపీ నేతలతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.