లడ్డూ , దర్శనం, వసతి వంటి సేవల మీద భక్తుల నుండి అభిప్రాయ సేకరణ

టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆపీసర్ శ్యామల్ రావు ఆదేశాలు;

Update: 2025-06-20 04:55 GMT
టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె శ్యామల్ రావు

 తిరుమల తిరుపతి దేవస్థానములు అందిస్తున్న సేవలను మెరుగుపరిచేందుకు శ్రీవారి భక్తుల  అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్ణయించింది.  ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు ఇది దోహపడుతుందని, క్రమం తప్పకుండా భక్తుల అభిప్రాయాలు సేకరించేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు వివిధ శాఖలను ఆదేశించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలయింది.  టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో భక్తుల  అభిప్రాయ సేకరణపై వివిధ విభాగాల అధిపతులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, వడ పంపిణీ, వసతి, కాలినడక భక్తులకు అందుతున్న సేవలు, లగేజీ, కళ్యాణకట్ట, వైద్యం, పారిశుధ్యం, పరిశుభ్రత, విజిలెన్స్, ట్రాన్స్ ఫోర్ట్ తదితర అంశాలపై భక్తుల నుండి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని, భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా ఈవో చెప్పారు.
శ్రీ మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద భవనంలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు హాళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సాధ్యాసాద్యాలను పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు. భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఆలస్యం చేయకుండా క్రమపద్దతిలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బియ్యం, వంట సరుకుల నాణ్యత పరీక్షించేందుకు ఆధునిక పరికరాలను ఉపయోగించాలని, భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాలను అందించాలని ఆయన సూచనలిచ్చారు. 
వసతి గృహాలలో సకాలంలో పరిశుభ్రతా ప్రమాణాలను పాటించేందుకు వీలుగా రిసెపక్షన్, ఐటీ విభాగాలు సమన్వయంతో ఎఫ్.ఎమ్. ఎస్ యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. భక్తుల రద్దీ సమయాలలో లడ్డూ కౌంటర్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా, ఆలస్యం చేయకుండా లడ్డూలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రద్దీకి తగ్గట్టుగా లడ్డూ కౌంటర్లలో సిబ్బందిని నియమించాలన్నారు. తిరుపతి, తిరుమల ప్రాంతాలలో రవాణా వ్యవస్థ మీద విజిలెన్స్, పోలీస్, ట్రాన్స్ పోర్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేసి నిఘాను మరింత పెంచాలని , కల్యాణకట్టలో విజిలెన్స్ విభాగం, కల్యాణకట్ట విభాగాలు మరింత సమన్వయంతో భక్తులకు సేవలు అందించాలని సూచించాలన్నారు. తిరుమలలో ఉచిత బస్సుల సేవలపై భక్తులకు తెలిసేలా ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇవ్వాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, శ్రీవారి సేవకులను నియమించి అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.
,ఈ కార్యక్రమంలో వర్చువల్ ద్వారా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి పరిపాలనా భవనం నుండి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళీ కృష్ణ, సీఈ శ్రీ టివి సత్యనారాయణ, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.


Tags:    

Similar News