తిరుపతి: IISER ల్యాబ్ లో మండిన రసాయనం

కేంద్ర విద్యా సంస్థ isar ప్రయోగశాలలో మంటలు చెలరేగాయి. కోట రూపాయల నష్టం జరిగినట్లు తెలుస్తోంది;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-10 16:06 GMT

తిరుపతి జిల్లా ఏర్పాటు వద్ద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన భారతీయ విజ్ఞాన శిక్షణ పరిశోధనా సంస్థ (Indian institute of science education and research Tirupati)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యార్థులు చేస్తున్న ప్రయోగశాలలో రసాయనిక పదార్థాల వల్ల మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. ముందుజాగ్రత్త చర్యగా ఐసర్ వద్ద అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచారు.


తిరుపతి నుంచి శ్రీకాళహస్తి కి వెళ్లే మార్గంలో ఉన్న ఏర్పేడు మండలం జంగాలపల్లి వద్ద కేంద్ర ప్రభుత్వం భారతీయ విజ్ఞాన శిక్షణ పరిశోధన సంస్థ (ఐసర్) విద్యాసంస్థను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో 3000 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఇక్కడ బోధన జరుగుతుంది.


ఈ ఐసర్ విద్యా సంస్థ కోసం జి ప్లస్ 5 భవనాలను నిర్మించారు. యథావిధిగానే విద్యార్థులు ఇక్కడ ప్రయోగాలు చేయడం చదువుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో కెమిస్ట్రీ ల్యాబ్ లో పరిశోధనలు చేస్తుండగా రసాయనిక పదార్థాలు మండుకోవడం వల్ల భవనం మొత్తం దట్టమైన పగల వ్యాపించాయి. ఈ సంఘటనతో విద్యార్థులు తోపాటు అధ్యాపకులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లేబరేటరీ ఉన్న గది తో పాటు మిగతా భవనానికి కూడా పొగలు కమ్మేస్తున్నాయి.

దీంతో అప్రమత్తమైన ఐసర్ అధికారులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.. సమీపంలోని శ్రీకాళహస్తి, వెంకటగిరి పట్టణంతోపాటు తిరుపతి నుంచి కూడా మూడు ఫైర్ ఇంజన్లు ఐసర్ విద్యాసంస్థ వద్దకు చేరుకున్నాయి. పొగలు కమ్ముకొని మంటలు చెలరేగుతున్న కెమిస్ట్రీ విభాగం లాబరేటరీ తో పాటు మిగతా ప్రాంతానికి కూడా మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి పరిస్థితి అదుపు చేశారు.
ఇది ఇలా జరుగుతుండగానే తరగతి గదుల్లో చిక్కుకుపోయిన విద్యార్థులకు ఇలాంటి ప్రమాదం లేకుండా అందరినీ సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ఈ ప్రయత్నంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెమిస్ట్రీ లేబరేటరీ లో జరిగిన ప్రమాదం వల్ల నష్టం భారీగానే ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ వివరాలు మాత్రం అధికారులు బయటకు చెప్పడం లేదు.

Similar News