టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే

సోమవారం నామినేషన్‌లకు దాఖలు చేసేందుకు గడువు ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేశారు.;

By :  Admin
Update: 2025-03-09 16:22 GMT

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు తెరదించారు. ముగ్గురు నేతలను ఖరారు చేశారు. గత కొన్ని రోజులుగా దీనిపై తీవ్ర కసరత్తు చేశారు. సోమవారం నామినేషన్‌లకు ఆఖరు కావడంతో అభ్యర్థులను ప్రకటించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నేతలకు కేటాయించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, బీసీ వర్గానికి చెందిన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటీ నాయుడు, ఎస్సీ వర్గానికి చెందిన మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మలను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేస్తూ ప్రకటించారు.

దీంతో నామినేషన్‌ పత్రాలను సిద్ధం చేసుకోవడంలో వారు నిమగ్న మయ్యారు. రాయలసీమ కర్నూలుకు చెందిన బీటీ నాయుడుకు మరో సారి అవకాశం కల్పించారు. అటు సీఎం చంద్రబాబును, ఇటు నారా లోకేష్‌ను అంటిపెట్టుకొని ఉన్న బీదా రవిచంద్రకు అవకాశం కల్పించారు. సార్వత్రి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నం చేసిన నిరాశకు లోనైన ప్రతిభా భారతి కూతురు గ్రీష్మకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఈ నెలాఖరు నాటికి ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, జంగా కృష్ణమూర్తి, పి అశోక్‌ బాబుల పదవీ కాలం మార్చి 29 నాటికి ముగియనుంది.

వీటిల్లో ఇప్పటికే ఒక స్థానాన్ని కూటమి భాగస్వామి అయిన జనసేనకు కేటాయించింది. ఆ పార్టీ తరపున డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోదరుడు కొణిదెల నాగబాబు గత శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. తక్కిన నాలుగు స్థానాల్లో ఒక సీటును కూటమి భాగస్వామి అయిన బీజేపీకి కేటాయించాలని నిర్ణయించారు. తక్కిన మూడు సీట్లను టీడీపీకి కేటాయించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. అయితేమ మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌కు ఈ స్థానం కేటాయించే అవకాశాలు ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది.
ఎమ్మెల్సీ సీటు మీద ఎంతో ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకు నిరాశే ఎదురైంది. సీనియర్‌ నాయకుడైన యనమలకు ఈ సారి అవకాశం లేకుండా పోయింది. జంగా కృష్ణమూర్తి, పి అశోక్‌ బాబులు ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలించ లేదు. వీరితో పాటు పదుల సంఖ్యలో ఈ స్థానాల కోసం పోటీ పడ్డారు. కానీ వారందరికీ నిరాశే మిగిలింది. ఈ జాబితోలో మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్‌లు కూడా ఉన్నారు. అయితే వీరికి రెండేళ్ల తర్వాత ఖాళీ అయ్యే స్థానాల్లో అవకాశం కల్పిస్తామని పార్టీ అధిష్టానం చెప్పినట్లు సమాచారం.
Tags:    

Similar News