చంద్రబాబు రాజకీయాలకు..మన రాజకీయాలకు తేడా ఉంది
వెన్నుపోటుతోనే చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.;
చంద్రబాబు రాజకీయాలకు.. మన రాజకీయాలకు చాలా తేడా ఉందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కీలక నాయకులతో గురువారం జగన్ సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు మీద, ఆయన పాలన మీద, చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. 12 నెలలచంద్రబాబు పాలనలో ఆయన చేస్తున్న రాజకీయాలకు, వైఎస్ఆర్సీపీ చేస్తున్న రాజకీయాలకు చాలా తేడా ఉందన్నారు. ప్రజలు మనకు అధికారం ఇస్తేనే తీసుకున్నామని, దొడ్డిదారిన వెన్నుపోటు పొడిచి రాజకీయం చేయలేదన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం వెన్నుపోటుతో మొదలు పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అధికారం కోసం చంద్రబాబు ప్రజలను జీవితమంతా వెన్నుపోటు పొడుస్తూనే రాజకీయమంతా కొనసాగిస్తూ వచ్చారని అన్నారు.