ఉగ్రవాదులను ఏరిపారేయాలి
పహల్గాం ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్.;
ఉగ్రవాదులను ఏరి పారేయాలని మధుసూదన్ కుటుంబ సభ్యులు అన్నారు. ఉగ్రవాదులు లేకుండా బుద్ది చెప్పాలని, ఉగ్రవాదుల చేతిలో మరెవ్వరూ కూడా ప్రాణాలు కోల్పోకూడదని, దీనిపై భారత దేశం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. పాకిస్తాన్ తీవ్ర వాదుల స్థావరాలపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పహల్గాం ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్భంగా మధుసూదన్ తల్లి పద్మావతి మాట్లాడుతూ.. తనకు కలిగిన కడుపుకోత భవిష్యత్లో ఏ తల్లి పడకూడదు. ఉగ్రవాదులను అంతం చేయాలి. ఎన్ని యుద్దాలు చేసినా నా కొడుకును తీసుకొని రాలేరు. నా కొడుకు అమాయకుడు. ఉగ్రవాదులు నా కుటుంబానికి తీరని ద్రోహం చేశారు. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన కొడుకులాగా మరెవ్వరూ కూడా ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోకూడదని, ఆ విధంగా భరత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పద్మావతి కోరారు.