జగన్‌పై దాడి.. కంటి పైన గాయం

మేమంతా సిద్ధం యాత్రలో సీఎం జగన్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో జగన్ ఎడమ కంటి కనుబొమ్మకు గాయమైంది. అయినా జగన్.. యాత్రను కొనసాగించారు.

Update: 2024-04-13 16:44 GMT

ఆంద్ర సీఎం జగన్‌పై ‘మేమంతా సిద్ధం’ యాత్రలో దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి.. జగన్‌పై రాయి విసిరాడు. ఆ రాయి తగలడంతో జగన్ ఎడమ కంటికి గాయమైంది. ఈ దాడిలో జగన్‌ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా గాయమైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది.. సీఎం జగన్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం ప్రయార బస్సులోనే జగన్‌కు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స అనంతరం సీఎం జగన్ తన యాత్రను కొనసాగించడం గమనార్హం. అయితే జగన్‌పై క్యాట్‌బెల్‌తో దాడి చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన విజయవాడలో నిర్వహించిన రోడ్‌షోలో చోటు చేసుకుంది. ఈ రాత్రి స్టేపాయింట్ కేసరపల్లి బైపాస్ శివారుకు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడే ఆయన మరికాసేపట్లో మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశి నాని మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News