డీజీపీకి నివేదికను అందించిన సిట్

ఆంధ్రలో ఎన్నికల పోలింగ్ రోజు నుంచి ప్రతిరోజూ ఎక్కడో ఒక చోటు జరుగుతున్న హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసింది.

Update: 2024-05-20 12:21 GMT

ఆంధ్రలో ఎన్నికల పోలింగ్ రోజు నుంచి ప్రతిరోజూ ఎక్కడో ఒక చోటు హింసాత్మక ఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇటీవల టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై జరిగిన దాడితో ఈ అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. వెంటనే ఈ హింసాత్మక ఘటనలపై దర్యాప్తు ప్రారంభించాలంటూ ప్రత్యేక సిట్‌ను నియమించింది. దీంతో రంగంలోకి దిగిన సిట్ తన దర్యాప్తును ముగించుకుని వాటిపై 150 పేజీలతో సుదీర్ఘ నివేదికను సిద్దం చేసింది. ఆ నివేదికను కొద్దిసేపటి క్రితమే డీజీపీ హరీష్ కుమార్‌కు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ భేటి అందించారు. అంతకుముందే దాదాపుగా 30 ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై వారివురూ చర్చించుకున్నారు. వాటిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Tags:    

Similar News