రోల్ మోడల్స్.. ఆ సీనియర్ సిటిజన్స్
విశాఖ ఉక్కు రిటైర్డ్ ఉద్యోగులు రైలు ప్రయాణికుల దాహం తీరుస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా వాటర్ బాటిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.;
సాధారణంగా సీనియర్ సిటిజన్లు ఏం చేస్తారు? స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో గడుపుతూ కాలక్షేపం చేస్తారు. రామా కృష్ణా అనుకుంటూ కాలం వెళ్లదీస్తారు. కానీ ఈ సీనియర్ సిటిజన్లు మాత్రం అలా చేయడం లేదు. దేశంలో మరెక్కడా లేనివిధంగా మండు వేసవిలో రైళ్లలో ప్రయాణించే వారి దాహార్తి తీర్చేందుకు నడుం బిగించారు. రైలు ఆగగానే ఉరుకులు పరుగులతో వెళ్లి మంచినీటి బాటిళ్లను వారి చేతిలో పెడుతున్నారు. సాటి సీనియర్ సిటిజన్లకు రోల్ మోడల్స్గా నిలుస్తున్నారు.
దువ్వాడలో రైలు ప్రయాణికులకు వాటర్ బాటిళ్లను అందిస్తున్న సీనియర్ సిటిజన్లు
దువ్వాడలో రైలు ప్రయాణికులకు వాటర్ బాటిళ్లను అందిస్తున్న సీనియర్ సిటిజన్లు
కానీ సాధారణ బోగీల్లో ప్రయాణించే వారు కొనుక్కోవడం కష్టమని భావించి వీరికి పంపిణీ చేయాలన్న నిర్ణయానికొచ్చారు. ఇందుకోసం దూరప్రాంతం నుంచి వచ్చే భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ను ఎంచుకున్నారు. ఈ రైలు విశాఖపట్నంలో మధ్యాహ్నం 1.05 గంటలకు బయల్దేరి 1.30కి దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ రెండు నిమిషాలు ఆగుతుంది. ఈ స్వల్ప వ్యవధిలోనే రైలుకు ముందు, వెనక ఉండే జనరల్ బోగీలతో పాటు మహిళలు, దివాంగుల బోగీల్లోని సాధారణ ప్రయాణికులకు ఈ సీనియర్ సిటిజన్లు పరుగు పరుగున కిటికీల వద్దకు వెళ్లి లీటరు ఆర్వో కూలింగ్ వాటర్ బాటిళ్లను ఉచితంగా అందజేస్తున్నారు. ఇలా రోజుకు 200–250 మంది రైలు ప్రయాణికులకు దాహార్తిని తీరుస్తున్నారు. ఎండలకు అప్పటికే దాహంతో అల్లాడి పోతున్న ప్రయాణికులు ఆ బాటిళ్లలోని చల్లని వాటర్ తాగిు వేసవి తాపం నుంచి ఎంతో ఉపశమనం పొందుతున్నారు. ప్రధానంగా ప్రశాంత్ ఎక్స్ప్రెస్తో పాటు మధ్యాహ్నం వేళ దువ్వాడ స్టేషన్ మీదుగా వెళ్లే రత్నాచల్, అమరావతి, తిరుమల ఎక్స్ప్రెస్ల్లో వెళ్లే సాధారణ ప్రయాణికులకు కూడా మంచినీటి బాటిళ్లను వీలును బట్టి పంపిణీ చేస్తున్నారు. ఈ సీనియర్ సిటిజన్లు సాధారణ పాసింజర్లకే కాదు.. రైలింజన్ లోకో పైలట్లకు, ఆఖరి బోగీలో ఉండే గార్డులకు కూడా కూల్ వాటర్ బాటిళ్లను అందిస్తున్నారు.
రైలు ప్రయాణికులకు మంచినీటి బాటిళ్లు ఇస్తున్న చిన్నారులు, మహిళలు
స్వచ్ఛంద విరాళాల సాయంతో..
కంచుమూర్తి ఈశ్వర్
వేసవి ముగిసే వరకూ కొనసాగిస్తాంః ఈశ్వర్