16 ఏళ్లకు కుదిరిన కమిటీ ముహూర్తం

రాష్ట్రం విడిపోయాక పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ భేటీ కాలేదని చైర్మన్ వెల్లడించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-10 15:34 GMT
ఏపీ అసెంబ్లీ (ఫైల్) పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ (ఇన్ సెట్)

తిరుపతి కొర్పొరేషన్ పరిధి విస్తరించాలి.

రాష్ట్రంలో 16 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ మొట్టమొదటిగా పనిచేయడం ప్రారంభించిందని కమిటీ చైర్మన్ కూన రవికుమార్ చెప్పారు. గతంలో ఇలాంటి సమావేశం అమరావతిలో నిర్వహించామన్నారు.

ఆదాయం పెంచుకునేందుకు తిరుపతి నగర పాలక సంస్థ పరిధిని విస్తరించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. కమిటీ  విధివిధానాలను కూన రవికుమార్ వివరిస్తూ,

"రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాలు గడిచింది. కమిటీ ఒక సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి లేదు" అని ఆయన గుర్తు చేశారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ స్టాట్యూటరీ కమిటీ అని, దీని పరిధిలోకి 186 కంపెనీలు, అందులో మూడు యాక్ట్ బేస్డ్ కంపెనీలు, ఇంకొన్ని సొసైటీ యాక్ట్ ప్రకారం ఏర్పడిన కార్పొరేట్ కంపెనీలు, కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడిన కార్పొరేషన్లు ఉన్నాయి అని ఆయన వివరించారు.

తిరుపతిలో ఏపీఎస్పీడీసీఎల్, పర్యాటక, స్మార్ట్ సిటీ, టీటీడీలో అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతిని Public Undertaking Committee PUC మంగళవారం సమీక్షించింది. అనంతరం తిరుపతి పద్మావతి అతిథిగృహంలో మీడియాతో కమిటీ చైర్మన్ కూన రవికుమార్ మాట్లాడారు.
అటానమస్ యూనివర్సిటీస్ పియుసి పరిధిలోకి వస్తాయని అన్నారు. ఈ కమిటీ ద్వారా అన్ని కంపెనీల వ్యవహారాలపై సమీక్షించవచ్చన్నారు. అందులో భాగంగానే ఏపీ ఎస్పిడిసిఎల్, తిరుపతి స్మార్ట్ సిటీ, టూరిజం, టిటిడిపై సమీక్షించినట్లు చెప్పారు. వీటన్నింటిపై త్వరలో లోతుగా చర్చిస్తామన్నారు. ఈ నివేదికలు అసెంబ్లీ స్పీకర్ ముందుంచి, లోటుపాట్లను సవరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపిఎస్పిడిసిఎల్ ద్వారా మూడు నెలల్లో 53 వేల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయిస్తామన్నార. 33/11 kv సబ్ స్టేష పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ముగిసిన స్మార్ట్ సిటీ గడువు
2025 మార్చి 31వ తేదీతో న ముగిసిందని కమిటీ చైర్మన్ రవికుమార్ వెల్లడించారు. స్మార్ట్ సిటీ పనులు అన్ని కూడా త్వరలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 50 శాతం నిధులు విడుదల చేయలేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు విడతల నిధులు విడుదల కాలేదని ఆయన వివరించారు. తిరుపతి స్మార్ట్ సిటీ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
తిరుపతి పరిధి విస్తరించాలి
రాష్ట్రంలో టూరిజం ను అభివృద్ధి పరచాలని, ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి చాలా వరకు భూములు కేటాయించిందని,
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధి చాలా తక్కువ ఉందని కమిటీ చైర్మన్ కూన రవికుమార్ చెప్పారు. కార్పొరేషన్ పరిధిని పెంచాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేషన్ పరిధి పెంచకుంటే, ఆదాయం పోతుందన్నారు.

Similar News