ఎన్టీఆర్పై మోదీ పొగడ్తల వర్షం
నేడు 102వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు.;
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంజలి ఘటించారు. ఆ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్కు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోదీ ఎన్టీఆర్పై ఓ రేంజ్లో పొగడ్తల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్లోని నిరుపేదలు, అణగారిన వర్గాల సాధికారత దిశగా అడుగులు వేశారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఏపీ ప్రజల డెవలప్మెంట్కు ఎన్టీఆర్ చేసిన కృషి అద్భుతమని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆ మేరకు ఎక్స్ వేదికగా మోదీ ఓ పోస్టు పెట్టారు.
I pay homage to NTR Garu on his birth anniversary. He is widely admired for his efforts to serve society and empower the poor and downtrodden. His cinematic works also continue to enthral audiences. We are all deeply inspired by him.
— Narendra Modi (@narendramodi) May 28, 2025
The NDA Government in Andhra Pradesh, led by…
#NTRLivesOn
— N Chandrababu Naidu (@ncbn) May 28, 2025
యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త, ‘అన్న’ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. పేద ప్రజలకు కూడు,… pic.twitter.com/wcneOZD7CX