TDP MAHANAADU | లక్షమంది టీడీపీ శ్రేణులకు భోజన వసతి

రాయచోటి గువ్వలచెరువు ఘాట్ వద్ద కడప టీడీపీ మహానాడుకు వెళ్లే వారికి భోజన సదుపాయం కల్పించారు. మంత్రులు బీసీ జానార్థనరెడ్డి, మండిపల్లి ఏర్పాట్లు పరిశీలించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-24 15:44 GMT

కడపలో మూడు రోజుల పాటు నిర్వహించే టీడీపీ మహానాడుకు వెళ్లే నేతలు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా లక్ష మందికి సరిపడ భోజన వసతి కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

కడపకు మార్గంలో రాయచోటి నియోజవకవర్గం రామాపురం మండలం దాటగానేక గువ్వలచెరువు ఘాట్ ప్రారంభం అవుతుంది. ప్రారంభంలోనే ఖాళీ ప్రదేశంలో విస్తృత ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర మంత్రి బీసీ. జనార్థనరెడ్డితో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. 


ఈనెల 27, 28, 29 తేదీలలో కడపలో జరిగే మహానాడు సందర్భంగా రాయచోటి ప్రాంతం నుంచి వచ్చే టిడిపి నాయకులు, కార్యకర్తలు దాదాపు లక్ష మంది పైచిలుకు ప్రజలకు భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కడప మహానాడుకు వెళ్లే కార్యకర్తలు, నాయకుల కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ చెప్పారు.  

కుప్పం నుంచి  ప్రధాన మార్గంలో..
కుప్పం నుంచి చిత్తూరు, పూతలపట్టు, చంద్రగిరి, తిరుపతి, రైల్వేకోడూరు, రాజంపేట మీదుగా కడపకు చేరవచ్చు. ఇది కాస్త చుట్టూ తిరిగి వెళ్లాలి. ఈ మార్గంలో ప్రయాణం కనీసంగా ఏడు గంటల సమయం పడుతుంది. 
రాయచోటి పరిసర ప్రాంతాలే కాకుండా, కుప్పం, చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు ప్రాంతాల నుంచి రాయచోటి మీదుగానే కడపకు వెళ్లేందుకు జాతీయ రహదారి ఉంది. ఈ మార్గంలో రావడానికి ఐదు గంటలు పట్టే అవకాశం ఉంటుంది. దీంతో ఈ మార్గంలో వచ్చే టీడీపీ కార్యకర్తల కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.  
కడపలో నిర్వహించే మహానాడుకు మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు, కుప్పం, పలమనేరు, చిత్తూరు, తదితర నియోజకవర్గాల నుంచి లక్ష మందికి పైగానే టిడిపి శ్రేణులు హాజరయ్యే అవకాశం ఉందనే అంచానాలు ఉన్నాయన్నారు.  వీరందరికీ భోజన వసతులు పక్కాగా పకడ్బందీగా ఉండాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు. ఈ మార్గంలో వాహనా పార్కింగ్ కు  ప్రత్యేక స్థలం కేటాయించాలన్నారు. తన నియోజవర్గం రాయచోటి టీడీపీ శ్రేణులు ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తాయని ఆయన చెప్పారు.

Similar News