లోసారి కవిత్వము సమాజంలో ‘విస్ఫోటనం’

మనుషుల్ని ఆవిష్కరించిన పుస్తకం ఆయుధం లాంటి మనిషి అని ప్రముఖ విమర్శకులు మేడిపల్లి రవికుమార్‌ అన్నారు.;

Update: 2025-08-20 15:44 GMT

లోసారి కవిత్వము మనుషుల్ని ఆవిష్కరించిన, సంస్కరించిన కవిత్వమని, సమాజంలో విస్ఫోటనం అని, ఆయుధం లాంటి మనిషి పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు ఆచార్య మేడిపల్లి రవికుమార్‌ లాయర్‌ సంపత్‌ కుమార్‌ పేర్కొన్నారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో బుధవారం సీపి బ్రౌన్‌ గ్రంథాలయంలో అడిషనల్‌ ఎస్‌.పి లోసారి సుధాకర్‌ రచించిన ఆయుధం లాంటి మనిషి పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న విశ్రాంతి చార్యులు ఆచార్య మేడిపల్లి రవికుమార్‌ ఈ పుస్తక ఆవిష్కరణతో పాటు పుస్తక సమీక్షను చేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి రవికుమార్‌ మాట్లాడుతూ.. అమ్మ వైపు తప్ప అమ్మ రుణం తీర్చుకోలేవురా అని ఆయన కవిత్వం లో ప్రశ్నిస్తారు. అమ్మను అమ్మలా చూసుకుంటే అమ్మను ఎంతమందిని ఈరోజు సమాజంలో పుట్టిస్తున్నాము అని ప్రశ్నించే తత్వం కనిపిస్తుంది. ప్రతి పనిలోనూ ఒక మాతృమూర్తి ఉంటారని తెలిపారు.


ఈ పుస్తకంలో మొత్తం 72 కవితలు ఉన్నాయని, 72 పార్శ్వాలు కనిపిస్తాయి అన్నారు. కవిత్వానికి శిల్పం అంటే అవి మ్యూజియంలో పెట్టుకోవాలి తప్ప సమాజానికి పనికిరావు అన్నారు. కవిత్వమంటే సమాజంలో సమాజంలోని ప్రజల స్థితిగతులు వారి కష్టాలు కన్నీళ్లు అన్నిటిని చెప్పించడమే కవిత్వమని ఈ విషయాలన్నీ మరోసారి సుధాకర్‌ రచించిన ఆయుధం లాంటి మనిషి, మైనపు బొమ్మలు ఇతర కవిత పుస్తకాల్లో కనిపిస్తాయన్నారు. లోసారి వాస్తవాన్ని దర్శించడంలో విశ్లేషించడంలో ఈయన కవిత్వంలో కనిపిస్తాయని అన్నారు. రుజుమార్గంలో సమాజాన్ని చూడడం సుధాకర్‌ కవిత్వంలో ఉంటుందన్నారు. కావ్యం రాసిన వాడే కవి.. మంచిగా ఆలోచించే ప్రతీ వ్యక్తి కూడా కవిగానే భావించాలన్నారు. ఒక కవి మాత్రమే ఏకకాలంలో మూడు లోకాలను చూడగలరని అన్నారు. మంత్ర ముగ్ధుల్ని చేసేటువంటి కవిత్వ నిర్మాణము లోసారి సుధాకర్‌ కార్యక్రమంలో ఉంటుందన్నారు.

అంబేడ్కర్‌ మిషన్‌ చైర్మన్, ప్రముఖ లాయర్‌ సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ లోసారి సుధాకర్‌ కవిత్వం సమాజంలో విస్ఫోటనం కలిగించే అక్షరాల ఆయుధాలు అని తెలిపారు. ఆయన వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ నిబద్ధత కలిగి నిజాయితీ కలిగి సమాజంలోని అనేక సమస్యలను తన కవిత్వంలోను వృత్తిలోనూ వ్యక్తపరచడం మనం చూస్తామన్నారు. ఆయన కవిత్వంలో అణగారిన ప్రజల జీవితాలను సమాజంలో అణిచివేయబడ్డ మనుషుల జీవితాలను కవిత్వంలో చూపిస్తారని చెప్పారు. గౌరవ అతిధి విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు ఎన్‌ ఈశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ లోసారి కవిత్వం సమాజంలో చైతన్యం కచ్చితంగా తీసుకొస్తుందని తెలిపారు. కవిత్వంలో శిల్పము ఆర్ధత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అన్నారు. సుధాకర్‌ కవిత్వంలో ప్రత్యేకమైన వ్యక్తీకరణ సాధారణమైన వాక్యాలతో లోతైన భావాలు కనిపిస్తాయి అన్నారు. లోసారీ కవిత్వం చదువుతూ ఉంటే శ్రీశ్రీ దేశ చరిత్ర చదువుతున్నట్లు ఉంటుందన్నారు.
ఆయన కవిత్వంలో సామాజికంగా మార్పు కోరేదిగా ఉంటుందన్నారు. రెండు దేహాలు కరచాలనం చేసినప్పుడు గాని రెండు దేహాలు మాట్లాడుకోవడం తన కవిత్వంలో వ్యక్తీకరిస్తారని పేర్కొన్నారు. ఇంటాక్‌ కన్వీనర్‌ చిన్నపరెడ్డి మాట్లాడుతూ అందరిని తట్టి లేపే కలిగిన శక్తి కవికే ఉంటుందన్నారు. ఆచార్యా రామ ప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ ఆయన రాసిన తడియారి సప్నం, మైనపు బొమ్మలు, ఇపుడు ఆవిష్కరణ చేసిన ఆయుధం లాంటి మనుషులను సమాజంలో పాటకులను చైతన్య పరిస్థితి ఆయుధాలుగా ఉంటాయన్నారు. సాహిత్యం పట్ల లోసారి సుధాకర్‌కు ప్రత్యేకమైన అభిరుచి ఉంటుందని, మనుషులలో చైతన్యం పెంపొందించడానికి లోసారి కవిత్వం బాగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంచాలకులు జి పార్వతి శివారెడ్డి, కేంగర మోహన్, అధ్యక్షులు విజయ్‌ కుమార్‌ స్వామి, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ నాయకులు అనిల్‌ కుమార్, కెవి రమణ, జేవి రమణ, సంగటి మనోహర్‌ గుర్రప్ప, డాక్టర్‌ ఓబుల్‌ రెడ్డి, మల్లెల భాస్కర్, శివరాం లెనిన్‌ ప్రసాద్, రాంప్రసాద్‌ రెడ్డి, ఫణి, నిరంజన్, మధు, వివిధ డిపార్ట్‌మెంట్ల ఉద్యోగస్తులు, సాహిత్యకారులు పాల్గొన్నారు.
Tags:    

Similar News