శ్రీశైలంలో కృష్ణమ్మకు కార్తీక హారతి

ప్రత్యేక వేదికపై శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజాధికాలు, దశహారతులు నదీమతల్లికి సారెను ఆలయ సమర్పించారు.

Update: 2025-11-01 04:33 GMT

-వడ్ల శ్రీకాంత్

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైల మహా క్షేత్రంలో అక్టోబరు 22 నుంచి నవంబరు 21వ తేదీ వరకు కార్తీకమాసోత్సవాలు ఆలయ అధికారులు వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్తీకమాసం రెండవ శుక్రవారం సందర్భంగా సాయంత్రం పాతాళగంగ వద్ద కృష్ణమ్మ హారతి కార్యక్రమం వేద పండితుల మధ్య వైభవంగా నిర్వహించబడింది.

పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణవేణి నదీమతల్లి విగ్రహానికి పూజాదికాలు, వస్త్ర సమర్పణ తదితర కార్యక్రమాలు శాస్త్రబద్ధంగా నిర్వహించారు. అనంతరం పాతాళగంగ ఘాట్ వద్ద నీటిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజాధికాలు, దశహారతులు నదీమతల్లికి సారెను ఆలయ అధికారులు సమర్పించారు.

నదీమతల్లికి ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి,నాగహారతి, పంచహారతి, సద్యోజాతాది పంచహారతులు, కుంభహారతి, నక్షత్రహారతి, రథహారతి, కర్పూరహారతులు ఇచ్చారు. లోకకల్యాణార్థమై ప్రతీ సంవత్సరం కార్తికమాసంలో నదీమతల్లికి హారతులను సమర్పించడం జరుగుతోందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమాన్ని యాత్రికులు ఎంతో భక్తితో వీక్షించారు.

Tags:    

Similar News