ఎంత మంది పిల్లలు ఉంటే.. అంత మందికి తల్లికి వందనం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పూర్తి అయిన సందర్భంగా మంత్రి నారా లోకేష్తో కలిసి సీఎం చంద్రబాబు మాట్లాడారు.;
సూపర్ సిక్స్లో తల్లిక వందనం అత్యంత కీలకమైందని, ఒకరికిచ్చి.. మిగిలిన వాళ్లకు ఇవ్వకపోవడం కరెక్టు కాదని భావించి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం కేవలం 42లక్షల మందికి అమ్మ ఒడి ఇస్తే.. కూటమి ప్రభుత్వం సుమారు 67లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అయిన సందర్భంగా గురువారం ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్తో కలిసి సీఎం చంద్రబాబు మాట్లాడారు.
ఈ సందర్భంగా తల్లికి వందనం అమలు జీవోను మంత్రి నారా లోకేష్కు సీఎం చంద్రబాబు అందజేశారు. తల్లికి వందనం పథకం గురించి ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు తల్లికి వందనం నగదును వారి గార్డియన్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ట్రాన్స్పరెన్సీ పాటించడం కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను కూడా డిస్ప్లే ఉంటుందన్నారు. ఈ నెల 26 వరకు గడువు ఉందని.. జూన్ నెలాఖరు 30 నాటికి ఫైనల్ జాబితాను ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 67 లక్షల మంది విద్యార్థుల కోసం రూ. 10,091 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. తల్లికి వందనం కింద జమ చేసే ఈ మొత్తంలో నుంచి రూ. 1,346 కోట్లు పాఠశాలల డెవలప్మెంట్ కోసం వెళ్తుందన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకానికి ఉన్న గైడ్లైన్స్నే తల్లికి వందనం స్కీమ్కు కొనసాగిస్తామన్నారు.