శ్రీవారి ఆలయంలో 20న దీపావళి ఆస్థానం

ఆర్జిత సేవలు రద్దు. ప్రొటోకాల్ దర్శనాలకే పరిమితం.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-10-07 13:06 GMT

తిరుమల ఆధ్మాత్మిక క్షేత్రంలో ఉత్సవాలకు కొదవ లేదు. శ్రీవారి నిత్యపూజలు, అలంకరణలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో విశిష్టమైన రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఉంటుంది. అందులో ఈ నెల 20వ తేదీ దీపావళి పర్వదినం సందర్భంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఆ రోరు ఆర్జీత సేవలు రద్దు చేశారు. ప్రొటోకాల్ లో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులకు మినహా సిఫారసు లేఖలు స్వీకరించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 20 తేదీన‌ దీపావళి ఆస్థానం టీటీడీ శాస్త్రోక్తంగా ఎలా నిర్వహిస్తుందంటే.. దీపావళి పండుగ రోజు ఉదయం ఏడు నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.
ఎలా చేస్తారు..
దీపావళి ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. సాయంత్రం ఐదు గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.
ఆర్జిత సేవ‌లు ర‌ద్దు
దీపావ‌ళి ఆస్థానం కార‌ణంగా అక్టోబరు 20న క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
Tags:    

Similar News