వివాదాస్పదమైన ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లోని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ఒక వేదికపై సర్పంచ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి.;
ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పోడల వెంటకట పార్థసారథి నేతృత్వంలో జూన్ 16న, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని ధనాపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం సర్పంచులకు అందిస్తున్న సహాయంపై చర్చించేందుకు సభ జరిగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఒక సర్పంచుతో ఆయన చేసిన సంభాషణ వివాదానికి దారితీసింది. కుల ఆధారిత వివక్ష, మతపరమైన సున్నితత్వం ఆరోపణలకు కారణమయ్యాయి. ఈ ఘటన ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. 1989లోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచార నిరోధక) చట్టం కింద చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.
సంఘటన ఏమిటి?
ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి బీజేపీ కండువాతో దూరంగా నిలబడిన ధనాపురం గ్రామ సర్పంచ్ రాజశేఖర్ ను గుర్తించి, “అయ్యా నువ్వు సర్పంచువా? ఎందుకు దూరంగా నిలబడ్డావు? ఇక్కడికి రా.. దగ్గరకు వచ్చి మాట్లాడు” అని పిలిచారు. సర్పంచ్ దగ్గరకు రావడానికి సంశయిస్తుండగా, పార్థసారథి వేదికపై తన పక్కనున్న తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మతో “అతను క్రిస్టియనా?” అని అడిగారు. ఆమె, “లేదు సార్, అతను ఎస్సీ (షెడ్యూల్డ్ కులం), అందుకే రాలేకపోతున్నాడు” అని సమాధానమిచ్చింది. ఈ సంభాషణ తర్వాత, పార్థసారథి మళ్లీ “సర్పంచ్, ఇక్కడకు రా” అని పిలిచారు. వేదిక వద్దకు సర్పంచ్ చేరుకోగానే వేదికపైకి ఎక్కించకుండా కిందే నిలబడి మాట్లాడమన్నారు.
ఇటీవల ఎమ్మెల్యే ఆదోని నియోజకవర్గంలో ‘ప్రజల వద్దకు పార్థసారథి’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంటా ధనాపుంరలో గురువారం ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద సభ నిర్వహించారు. ఈ సభలో సంఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటన సర్పంచ్ మతం గురించి ప్రశ్నించడం, అతని కులం తెలిసిన తర్వాత వేదికపైకి ఎక్కించుకోకపోవడం అనేక మందికి అవమానకరంగా, వివక్షా పూరితంగా అనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఎక్స్లో విస్తృతంగా షేర్ కావడంతో ప్రజల ఆగ్రహం మరింత పెరిగింది.
ఎక్స్లో ప్రజల స్పందన
ఈ ఘటన ఎక్స్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. పార్థసారథి చర్యలను కులవివక్షగా, అగౌరవ పరంగా తీవ్రంగా ఖండించారు.
వైఎస్సార్సీపీతో అనుబంధం ఉన్న ఒక యూజర్.. పార్థసారథి సర్పంచ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడని తెలిసిన తర్వాత వేదికపైకి రానివ్వకుండా అవమానించారని ఆరోపించారు. ఇది కూటమి ప్రభుత్వం అభిప్రాయం వ్యాఖ్యానించారు.
మరొక పోస్ట్లో సర్పంచును మొదట ఆహ్వానించి, కులం తెలిసిన తర్వాత ప్రవర్తన మార్చడాన్ని ఉద్దేశపూర్వక బహిష్కరణగా అభివర్ణంచారు.
ఇంకో పోస్ట్లో ఈ ఘటనను దలిత సర్పంచ్కు తీవ్ర అవమానంగా పేర్కొన్నారు. టీడీపీ మహిళా నాయకురాలు సర్పంచ్ ఎస్సీ అని చెప్పడంతో వేదికపైకి రాకుండా చేశారని ఆరోపించారు.
యూజర్లు పార్థసారథి ప్రవర్తనను ప్రశ్నిస్తూ, బహిరంగ సభలో కులవివక్ష అసహ్యకరమని, జవాబుదారీతనం కావాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే: సర్పంచ్... క్రిస్టియన్ ఆ?
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) June 18, 2025
టిడిపి నేత: ఎస్సీ ఎస్సీ
బీజేపీ ఎమ్మెల్యే: సరే ఇక్కడికి వచ్చి నుంచో!
ఈ రోజుల్లో కూడా ఇలా కులాల పేరు మీద పిలిచి మాట్లాడే నీచమైన సంస్కృతి ఎక్కడిది!#NDAGovt #BJP #TDP #Adoni #PVenkataParthasarathi #AndhraPradesh #UANow pic.twitter.com/MRCAHg3VwY