Rishikesh || రిషికేష్‌"లో శ్రీవారి వైభవం.

మే 11 నుంచి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు.;

Update: 2025-04-29 08:00 GMT

ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్ జిల్లా, రిషికేష్‌ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా మే 6వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. మే 10వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

రోజు ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
తేదీ
11-05-2025
ఉదయం - ధ్వజారోహణం (ఉద‌యం 10.50 నుండి 11.15 గంట‌ల వ‌ర‌కు)
సాయంత్రం - పెద్దశేషవాహనం
12-05-2025
ఉదయం - చిన్నశేషవాహనం
సాయంత్రం - హంసవాహనం
13-05-2025)
ఉదయం - సింహవాహనం
సాయంత్రం - ముత్యపుపందిరి వాహనం
14-05-2025
ఉదయం - కల్పవృక్షవాహనం
సాయంత్రం - సర్వభూపాలవాహనం
15-05-2025
ఉదయం - పల్లకీ ఉత్సవం
సాయంత్రం - గరుడవాహనం
16-05-2025
ఉదయం - హనుమంత వాహనం
సాయంత్రం - గజవాహనం
17-05-2025
ఉదయం - సూర్యప్రభ వాహనం
సాయంత్రం - చంద్రప్రభ వాహనం
18-05-2025
ఉదయం - రథోత్సవం
సాయంత్రం - శ్రీవారి కల్యాణోత్సవం, అశ్వవాహనం
19-05-2025
ఉదయం - చక్రస్నానం (ఉద‌యం 9 నుండి 9.45 గంట‌ల వ‌ర‌కు)
సాయంత్రం - ధ్వజావరోహణం
ఉత్సవాల్లో భాగంగా మే 18వ తేదీ స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ .501/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.


Tags:    

Similar News