2029లో భూమి చుట్టుర రెండు రౌండ్లు కొట్టనున్న జాహ్నవి దంగేటి

ఆకాశంలోకి ఎగరనున్న ఆంధ్రా అమ్మాయి;

By :  Admin
Update: 2025-06-24 05:51 GMT

తెలుగమ్మాయి దంగేటి జాహ్నవి (Dangeti Jahnavi) ఆకాశంలో అడుగుపెట్టబోతున్నారు. ఆమె వయసు 23 సంవత్సరాలు. అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ (Titan Space Industries) చేపట్టిన స్పేస్ మిషన్ (Titans Space Mission) కోసం ఆమె ఆస్ట్రోనాట్ కాండిడేట్ (ASCAN)గా ఎంపికయ్యారు. 2029లో జరగబోయే తొలి అంతరిక్ష యాత్రలో ఐదు గంటల పాటు జాహ్నవి రోదసిలో గడపనున్నారు. ఇది జరిగితే ఆంతరిక్షంలోకి ఎగిసిన తొలి ఆంధ్రా మహిళ అవుతుంది.

చిన్నపుడు చందమామా నావెనకే వస్తున్నదని భావించేదాన్ని. కాని, అది నన్న తన దగ్గిరకే నడిపిస్తున్నదని ఇపుడు నాకు అర్థమయింది. ఇపుడా చిన్ననాటి వాస్తవంగా నా జీవితంలో ఒక భాగమవుతున్నదని ఆమె ఈ వార్తను పంచుకున్నారు.


"As a kid who believed that the Moon followed me, I didn’t know it was leading me here. Today, that childhood wonder becomes a part of my reality,"అంటూ ఈ వార్తని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఆమె ఆస్ట్రోనాట్ కాండిడేట్ (ASCAN)గా ఎంపికయ్యారు. టైటాన్ స్పేస్ ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షలన్నీ పూర్తిచేసిన జాహ్నవి ఈ స్పేస్ మిషన్‌కు అర్హత సాధించారు. ఆమె ఎలెక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేశారు.

"I’m incredibly honored and excited to announce that I have been officially selected as an Astronaut Candidate (ASCAN) for Titans Space – Inaugural Class of 2025."

ఆమె ఆకాశంలో ఉన్నపుడు రెండు సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. రెండు సూర్యోదయాలను, రెండు సూర్యాస్తమయాలను చూస్తుంది. ఆమె సుమారు మూడు గంటల పాటు జీరో గ్రావిటీలో పనిచేస్తారు.

2029 మార్చిలో నిర్వహించబోయే మొదటి అంతరిక్ష యాత్ర బృందంలో భారత్ నుంచి జాహ్నవి పాల్గొనబోతున్నారు. ఈ యాత్రలో భాగంగా ఆమె ఐదు గంటల పాటు అంతరిక్షంలో గడపుతుంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది అమెరికాతో పాటు పలు దేశాల్లో మూడేళ్లపాటు శిక్షణ ఇస్తారు. అదెలా ఉంటుందో ఆమె ఇలా చెప్పారు.

"The inaugural mission, set for 2029, will be a Titans Space orbital flight lasting 5 hours. It will feature 3 hours of sustained zero gravity, offering a uniquely transformative environment for scientific research and human spaceflight advancement."


జాహ్నవి 2021లో నాసా నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్’కు భారత్ తరపున ఎంపికై రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా జాహ్నవి 2026 నుంచి మూడేళ్లపాటు టైటాన్ స్పేస్ ASCAN ప్రోగ్రామ్‌లో వ్యోమగామి శిక్షణ పొందుతారు. ఈ శిక్షణలో ఫ్లైట్ సిమ్యూలేషన్, స్పేస్‌ క్రాఫ్ట్ ప్రొసీజర్లు, సర్వైవల్ ట్రైనింగ్, మెడికల్, సైకాలజికల్ అసెస్‌మెంట్లు ఉండనున్నాయి. 2029లో ఐదు గంటలపాటు సాగనున్న ఈ ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్‌ ద్వారా శాస్త్రీయ పరిశోధన, మానవ అంతరిక్ష పరిశోధనకు ఓ కొత్త దిక్సూచి ఏర్పడనుందని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

జాహ్నవి పాలకొల్లులో జన్మించారు.

అక్కడే పెరిగారు. ఇంటర్ దాకా అక్కడ చదివారు. తర్వాత పంజాబ్ లోని లవ్ లీ ప్రొఫెషనల్ యూనివర్శిలో బీటెక్ పూర్తిచేశారు. 2022లో పోలాండ్‌ లోని అనలాగ్ వ్యోమగాముల శిక్షణ కేంద్రం (AATC)లో శిక్షణ పొందిన జాహ్నవి, అతి చిన్న వయస్సులోనే అనలాగ్ వ్యోమగామిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది 2022లో పోలెండ్ లో జరిగింది. NASA నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించింది జాహ్నవి.

ఇప్పటికే చిన్న రాకెట్ అయిన ‘సెస్నా 171 స్కైహాక్’ ను విజయవంతంగా నడిపి రికార్డ్ సృష్టించింది. జీరో గ్రావిటీ, మల్టీ యాక్సిస్ ట్రైనింగ్, అండర్‌ వాటర్ రాకెట్ లాంచ్, ఎయిర్ క్రాఫ్ట్ డ్రైవింగ్ వంటి అంశాల్లో శిక్షణ పొందింది కూడా. ఆమె 16 దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించింది. అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన దాదాపు అన్ని స్కిల్స్ లో ఆమె శిక్షణ పొందింది. స్కూబా డైవింగ్‌లో అడ్వాన్స్‌డ్ లెవెల్ ట్రైనింగ్ పూర్తి చేయడం ద్వారా కూడా నీటి లోతుల్లో గ్రావిటీ లేని పరిసరాల్లో పనిచేయగల సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంది. ఆమె తల్లితండ్రులుశ్రీనివాస్, పద్మశ్రీ కువాయిత్ లో నివసిస్తున్నారు.

Tags:    

Similar News