
నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్గా మరింది. ఈ సస్పెన్స్కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
Live Updates
- 4 Jun 2024 12:30 PM IST
13 వ రౌండ్....గుంటూరు.తూర్పు
టిడిపి..72.220
వైసిపి...45.376
టిడిపి అడుక్యం...26.844
- 4 Jun 2024 12:28 PM IST
అమరావతిలోనే ప్రమాణ స్వీకారం
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ హవా చూసి తమదే విజయం అని టీడీపీ వర్గాలు పూర్తి ధీమా వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. ‘‘జూన్ 9న అమరావతి వేదికగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పదవి చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వస్తున్నాయి. రాక్షస పాలనను ప్రజలు వధించేశారు’’ అని ధీమా వ్యక్తం చేశారు.
- 4 Jun 2024 12:24 PM IST
విశాఖ రుషి కొండపై టిడిపి జెండా ఎగుర వేసిన పార్టీ శ్రేణులు..
ఇప్పటి వరకు రుషి కొండపై ఎవ్వర్ని అనుమతించని అధికారులు..
ఎన్నికల ఫలితాల జోష్ లో టీడీపీ..
- 4 Jun 2024 12:15 PM IST
కూటమి అభ్యర్ధుల ప్రభంజనం.. కొస్తా జిల్లాల వారీగా ఏ పార్టీ ఆధిక్యంలో ఉందంటే.?
తూర్పుగోదావరిలో 13 టీడీపీ ఉంటే.. జనసేన 5, వైసీపీ 1 ఆధిక్యంలో కొనసాగుతోంది.
అటు పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ 8, జనసేన 5, వైసీపీ 2 ఆధిక్యంలో ఉన్నాయి.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిశీలిస్తే.. టీడీపీ 8, జనసేన 4, వైసీపీ 2, బీజేపీ 1 స్థానాల్లో లీడింగ్లో ఉన్నాయి.
శ్రీకాకుళంలో టీడీపీ 8, బీజేపీ 1, వైసీపీ 1లో ఉన్నాయి.
విజయనగరం(9)లో: టీడీపీ 7, జనసేన 1, వైసీపీ 1 స్థానాల్లో,
కృష్ణా(16)లో: టీడీపీ 13, జనసేన 1, బీజేపీ 2 స్థానాల్లో,
గుంటూరు(17)లో: టీడీపీ 16, జనసేన 1 స్థానంలో లీడ్లో ఉన్నారు.
అటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అమలాపురం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ లీడింగ్లో కొనసాగుతోంది. అటు బీజేపీ వచ్చేసి.. అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం.. కాకినాడ, మచిలీపట్నం స్థానాల్లో జనసేన లీడింగ్లో ఉన్నాయి.
- 4 Jun 2024 12:08 PM IST
ఉరవకొండ నియోజకవర్గంలో తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేసరికి
టిడిపి: 59,943
వైసీపీ: 50,479
టీడీపీ లీడీంగ్: 9,464
- 4 Jun 2024 12:07 PM IST
దూసుకు పోతున్న RRR
ఉండిలో టీడీపీ అభ్యర్థి కనుమూరు రఘురామ కృష్ణ రాజు భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు RRRకు మొత్తం 50 వేలకు పైగా ఓట్లు రాగా వైసీపీ క్యాండిడేట్ వెంకట నరసింహ రాజుకు 25వేల ఓట్లు వచ్చాయి. దీంతో రఘురామ 25 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
- 4 Jun 2024 12:03 PM IST
కృష్ణాజిల్లా, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి 6 రౌండ్ లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు 20,029 ఓట్ల మెజార్టీ
- 4 Jun 2024 12:03 PM IST
వైఎస్ఆర్సిపీ 16స్థానాల్లో ఆధిఖ్యంలో ఉండగా... జనసేన 19, భాజాపా 7, తెలుగుదేశం 132 స్థానాల్లో ఆధిక్యం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా మహిళకు అవకాశం
ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్
మంత్రి వర్గంలో జనసేనకు, భాజాపాకు సముచిత స్థానం
ఐపిసి సెక్షన్ 17 భయం పట్టుకున్న వైఎస్ జగన్..
- 4 Jun 2024 12:02 PM IST
అనంతపురం జిల్లా తాడిపత్రి
5వ రౌండ్ పూర్తి అయ్యే సరికి టీడీపీ అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డి 2700 ఓట్లు మెజారిటీ