నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
x

నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.


తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌గా మరింది. ఈ సస్పెన్స్‌కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.

Live Updates

  • 4 Jun 2024 8:38 AM GMT

    ప్రొద్దుటూరు


    టిడిపి అభ్యర్థి నందాల వరదరాజుల రెడ్డి ఘనవిజయం..

    22,733 వేల ఓట్ల మెజార్టీతో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై గెలుపు

  • 4 Jun 2024 8:37 AM GMT

    అనపర్తిలో బీజేపీ విజయం

    20,567 ఓట్లతో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి గెలుపు

    భీమవరంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులు గెలుపు

    64,037 ఓట్ల తేడాతో రామాంజనేయులు విజయం

    ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలుపు

    20,804 ఓట్ల మెజార్టీతో పయ్యావుల కేశవ్ గెలుపు

  • 4 Jun 2024 8:37 AM GMT

    శ్రీ సత్య సాయి.. పుట్టపర్తి 14 వ రౌండ్ ముగిసే సరికి పుట్టపర్తి ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి 5658 ఓట్లు ఆధిక్యం

  • 4 Jun 2024 8:37 AM GMT

    ధన్యవాదాలు తెలిపిన గౌత శిరీష


    పలాస నియోజకవర్గం కూటమి అభ్యర్థి గౌత శిరీష తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఎంతటి ఘనవిజయాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఒక వీడియోను తను రిలీజ్ చేశారు.


  • 4 Jun 2024 8:17 AM GMT

    లోక్‌సభ స్థానాల్లో కూడా కూటమిదే హవా

    అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన కూటమి.. లోక్‌సభ స్థానాల్లో కూడా తమ మార్క్‌ చూపిస్తోంది. మొత్తం 25 స్థానాలకుగానూ 16 సీట్లలో టీడీపీ, జనసేన 2 సీట్లలో, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. వైసీపీ మాత్రం కేవలం 4 సీట్లలోనే ఆధిక్యం కనబరుస్తోంది.

  • 4 Jun 2024 8:07 AM GMT

    ఏపీలో 175 స్థానాల్లో ఎవరు ఎన్నిచోట్ల ముందున్నారంటే..


    టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 134 చోట్ల ముందంజ..

    జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 20 చోట్ల ముందంజ..

    బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 చోట్ల ముందంజ..

    మొత్తంగా 161 స్థానాల్లో కూటమి ఆధిక్యం...

    14 చోట్ల వైసీపీ ఆధిక్యం...

  • 4 Jun 2024 8:06 AM GMT

    తెనాలి నియోజకవర్గం


    తెనాలి లో 14 వ రౌండ్ పూర్తయ్యేసరికి జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ 36,894 ఓట్లు మెజార్టీలో ఉన్నారు.

  • 4 Jun 2024 8:01 AM GMT

    చంద్రబాబుకు మోదీ ఫోన్

    టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఆంధ్రలో కూటమి ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి 161 సీట్లలో విజయం సాధించే దిశగా పయనించడం సంతోషకరమని ప్రధాని మోదీ చెప్పారు.

  • 4 Jun 2024 7:59 AM GMT

    విజయవాడ పశ్చిమ లో భారీ ఆధిక్యంతో దూసుకు పోతున్న బీజెపీ అభ్యర్థి సుజనా చౌదరి. ఏడవ రౌండ్ ముగిసే సమయానికి 20,700 మెజార్టీ తో సుజనా హవా

  • 4 Jun 2024 7:59 AM GMT

    ఉమ్మడి తూర్పు గోదావరిలో కూటమి ప్రభంజనం

    ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజ

Read More
Next Story