అమరావతిలో 5 వేల డ్రోన్లతో మెగా షో..!

Update: 2024-10-22 07:47 GMT

అమరావతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5వేల డ్రోన్లు ఎగరబోతున్నాయి. జాతీయ స్థాయి డ్రోన్ సమ్మెట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు. ఈ డ్రోన్ స‌మ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. పున్నమి ఘాట్ దగ్గర 5వేల‌కుపైగా డ్రోన్లు అలరించనున్నాయి. 9 థీమ్స్‌పై కార్యక్రమాలు జరగనున్నాయి. 400కి పైగా కంపెనీలు ఈ షోలో పాల్గొంటున్నాయి. 1800 మంది డెలిగేట్స్ హాజరవుతారు. నాలుగు కేటగిరీల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేశామన్నారు అధికారులు. విజేతలకు కేటగిరీల వారీగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ డ్రోన్ షోను విజయవాడ ప్రజలంతా తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. నగరంలో ఐదు చోట్ల భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు డ్రోన్ షో జరగనుంది.డ్రోన్‌ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో ఏపీని దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నామంటున్నారు అధికారులు.


Tags:    

Similar News