శ్రీవారి ఆలయంపై మరోసారి హెలికాఫ్టర్ చక్కర్లు..!

Update: 2024-10-21 09:02 GMT


తిరుమలలో ఇవాళ ఉదయం స్వామివారి ఆలయానికి దగ్గర హెలికాప్టర్ వెళ్లింది. కొందరు భక్తులు గమనించి తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు. కొందరు భక్తులు ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆలయం మీదుగా వెళ్లిన ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం విరుద్ధం. అందుకే తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని గతంలోనే. పలు సందర్భాల్లో కేంద్రాన్ని టీటీడీ కోరింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ దృష్టికి మాత్రం ఈ నిబంధన అమలు చేయడం వీలుకాదని తెలిపింది. గత రెండు, మూడేళ్లుగా శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగిరిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గతంలో అలాంటి ఘటనలు జరిగిన సమయంలో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ స్పందించింది. కొంతకాలంగా తరచూ విమానాలు, హెలికాప్టర్లు స్వామివారి ఆలయం మీదుగా వెళుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇలా విమానాలు, హెలికాప్టర్లు ఆలయం మీదుగా చక్కర్లు కొట్టడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు


Tags:    

Similar News