‘‘ముప్పై ఏళ్లు కష్టపడి సాగులోకి తెచ్చాక లాక్కోవాలనుకుంటున్నారు’’
గుజరాత్ దళిత మహిళల పోరాటం, 36 ఎకరాలపై కన్ను వేసిన మరో వెనకబడిన కులం పురుషులు, అధికారులు;
By : 491
Update: 2025-05-26 11:26 GMT
దమయంతి ధర్
అహ్మదాబాద్ లోని ధోల్కా తాలుకాలోని వౌతా గ్రామంలోని 76 ఏళ్ల దళిత మహిళ బలుబెన్ మక్వానా ఇంట్లోకి చొరబడిన కొంతమంది యువకులు ఆమెను భూమి విడిచిపెట్టమని బెదిరించారు. వీరంతా దర్బార్ కమ్యూనిటీకి చెందిన వారని తేలింది. వీరు కూడా వెనకబడిన కులాలకు చెందినవారే.
మక్వానా చేసిన నేరం ఏమిటీ? కేవలం దళితురాలే కావడం మాత్రమే కాదు. గ్రామంలో ఉన్న బీడు భూమిని సాగులోకి తెచ్చి, దళితులందరితో కలిపి సహకారం సంఘం ఏర్పాటు చేసింది.
ఇక్కడ ఉన్న బీడు భూమి 36 ఎకరాలపై వారి కన్ను పడింది. కానీ ఈ యాజమాన్యం నిలుపుకోవడానికే వారు దశాబ్ధాలుగా పోరాడుతున్నారు. దర్భార్లను వెనకబడిన కులంగా వర్గీకరించివచ్చు కానీ సామాజిక క్రమంలో వారు దళితులకంటే అనేక స్థాయిలలో ఉన్నత స్థానంలో ఉన్నారు.
వీరి కన్ను డెబ్బై ఏళ్ల దళిత మహిళ మూడు దశాబ్ధాలుగా సాగు చేసి అభివృద్ది చేసిన 36 ఎకరాలపై పడింది. ‘జై భీమ్ మహిళా ఖేతి మండల్’ ఖాళీ చేయాలని డిమాండ్ చేయడం ఈ మహిళలు నేరంగా భావిస్తున్నారు.
కులం కలను పాటిస్తున్నారు..
ఈ కుల ప్రత్యేక హక్కు యుగాల నాటిది. దర్భార్లు వౌథాలో చాలాకాలంగా ఆధిపత్య కుల సమూహంగా ఉన్నారు. ఎందుకంటే ఈ గ్రామంలో 2,500 కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
తరతరాలుగా వౌథాలో 70 దళిత కుటుంబాలు గ్రామం ఒక చివరలో నివాసం ఉంటున్నాయి. చనిపోయిన జంతువుల చర్మాన్ని ఒలిచి, మానవీయంగా పాకీ పనిచేయడం ద్వారా జీవనోపాధి పొందాయి.
దశాబ్ధాల నాటి ఈ వ్యవస్థ ద్వారా అభివృద్ది చెందమని భావించిన మక్వానా 1989 లో వౌథాకు చెందిన 50 మంది దళిత మహిళలను జేబీఎంకేఎం ఏర్పాటు చేసి వారి జీవితాల్లో మార్పు కోసం కృషి చేశారు.
గుజరాత్ లోని పురాతన దళిత హక్కుల సంస్థ, నవసర్జన్ ట్రస్ట్ మాజీ సభ్యురాలు, జేబీఎంకేఎం ఏర్పాటుకు సహాయపడిన ప్రీతి వాఘేలా ‘ ది ఫెడరల్’ తో మాట్లాడారు.
‘‘వౌథాల దళితులు వాల్మీకి ఉప సమూహానికి చెందినవారు, ఇది దళితులలో కూడా సామాజిక కుల సోపానక్రమంలో అత్యల్ప తక్కువ శ్రేణిగా పరిగణించబడుతుంది. వౌథాలో పురుషులకు పెద్దగా సంపాదించకపోవడంలో, మహిళలను మాన్యువల్ స్కావెంజింగ్ కు బలవంతం చేస్తున్నందున దళితులు దుర్బలంగా ఉన్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
1989కి ముందు వౌతాలోని దళిత మహిళలు ఉన్నత కులాలకు చెందిన మహిళలు ఉపయోగించే బహిరంగ మరుగుదొడ్లను శుభ్రం చేయవలసి వచ్చేదని వాఘేలా గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే దళిత పురుషులు ఇంటిని నడపడానికి తగినంత సంపాదన ఉండేదికాదు.
‘‘మొదట మేము భూమిని సాగు చేసుకోవడానికి దళిత పురుషులం సమష్టిగా ఏర్పాడాలని అనుకున్నాము. కానీ దర్భార్ పురుషుల దాడి తరువాత చాలామంది దళిత పురుషులు వెనక్కి తగ్గారు.
అప్పుడే మేము వారి భార్యలను వ్యవసాయంలోకి రావాలని ప్రొత్సహించాము. సంవత్సరాలుగా ఎండనక, వానక కష్టపడి గంటల తరబడి శ్రమించి, దర్బార్ల దురాగతాలకు వ్యతిరేకంగా నిలబడ్డారు’’ అని వాఘేలా వివరించారు.
జేబీఎంకేఎం ను ఏర్పాటు చేయడానికి కలిసి వచ్చిన 51 మంది దళిత మహిళలు స్థానిక మున్సిపల్ సంస్థ నుంచి 36 ఎకరాల భూమిని తరువాత నోటిఫైడ్ బంజరు భూమిని తీసుకున్నారు.
తరువాత దశాబ్ధంలో స్థానికులు, వారి స్వంత కుటుంబ సభ్యులు కలిసి నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్లారు. బంజరు భూమిని సాగుభూమిగా మార్చుకున్నారు.
దాదాపు దశాబ్ధం పాటు కష్టపడ్డాక అసాధ్యం అనుకున్నదానికి జేబీఎంకేఎం సాధించి చూపింది. బంజరు భూమి ఇప్పుడు సాగుకు అనుకూలంగా ఉండటమే కాకుండా సంవత్సరానికి రెండు పంటలు పండిస్తోంది.
దిగుబడి వారి రోజు వారీ అవసరాలు తీర్చడానికి మాత్రమే కాకుండా మార్కెట్లో విక్రయించడానికి, సమష్టిగా స్వల్ప ఆదాయాన్ని సంపాదించడానికి తగినంత మిగులు కూడా సంపాదించుకున్నారు. వత్రక్, సబర్మతి నదుల సంగమ ప్రాంతమైన ఈ వౌథకు ఇప్పుడు జేబీఎంకేఎం కొత్త గుర్తింపును తీసుకొచ్చింది.
కష్టాలు ప్రారంభం..
మన సమాజంలో సోపానక్రమంలో ఉన్నత కులాల నుంచి బెదిరింపులు, భూకజ్జా ప్రయత్నం, అధికారిక పత్రాలు లేకుండా సంపాదించుకున్న ల్యాండ్ ను తిరిగి ఇవ్వమని అధికారిక ఒత్తిళ్లు ప్రారంభం అయ్యాయి. కుల బెదిరింపులతో పాటు, ప్రభుత్వ అధికారులను కూడా నిరోధించడం మక్వానా రోజువారీ పనులలో భాగమైంది.
‘‘మేము సంవత్సరాలుగా మా రక్తం, చెమటతో సాగు చేస్తున్న భూమిని ఖాళీ చేయమని దర్బార్లు మమ్మల్ని బెదిరించడం ఇదే మొదటి సారి కాదు. చాలాసార్లు దాడులు జరిగాయి. కానీ ఈసారి ఎవరికి గాయాలు కాలేదు.
వారు కొన్ని ఫర్నిచర్ ధ్వంసం చేసి, మా స్వంత ట్రాక్టర్ పంక్చర్ చేశారు. ఇది ప్రతిపంట కాలంలో జరుగుతోంది. వారు పంటను నాశనం చేయడానికి కూడా ప్రయత్నిస్తారు.
కానీ మేము ఎల్లప్పుడూ వాటిని తరిమికొట్టగలిగాము’’ అని మక్వానా ది ఫెడరల్ తో అన్నారు. గత నెలలో పరిస్థితులు అనూహ్యమైనవి కాకపోయినా దారుణమైన మలుపు తీసుకున్నాయి.
స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి దర్భార్లు వచ్చారని మక్వానా తెలిపారు. ‘‘పోలీసులు మమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నించారు. గుజరాత్ భూ కజ్జా నిషేధ చట్టం-2020 కింద మమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు’’ అని ఆమె చెప్పారు.
ఈ చట్టం భూ కజ్జాను నేరంగా పరిగణిస్తుంది. దోషిగా తేలితే పది నుంచి పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించబడుతుంది.
‘‘మేము మా ప్రాణాలను అర్పిస్తామని, కానీ ఈ భూమిని వదులుకోమని వారికి చెప్పాము’’ అని జేబీఎంకేఎం వ్యవస్థాపకులు అన్నారు.
శ్రమ ఫలాలు..
మహిళల సమష్టి కృషి, దృఢ సంకల్పం మాత్రమే 36 ఎకరాల బంజరు భూమి నుంచి నేడు వేరుసెనగ, ఆముదం, పత్తి పంటలను పండించే విశాలమైన వ్యవసాయ క్షేత్రంగా మార్చిందని మక్వానా పేర్కొన్నారు.
పంటల అమ్మకం ద్వారా జేబీఎంకేఎం సంవత్సరానికి దాదాపు రూ. 8 లక్షల వార్షిక ఆదాయం పొందుతున్నారు.
‘‘నేను మొదటిసారిగా నా పారతో బంజరు భూమిలో అడుగుపెట్టిన సమయం నాకు ఇంకా గుర్తుంది. అది పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండి ఉంది. పూర్తిగా ముళ్లపొదలతో ఉంది.
భూమి లోపల ఒక చిన్నవేర్లు మిగిలిపోయినా అది తిరిగి మొలకెత్తుతుంది. కాబట్టి దాన్ని తొలగించడం కష్టం. దాని కాయలు పశువులకు కూడా విషపూరితమైనవి. ఈ భూమి సాగు చేస్తున్న సమయంలో మా కుటుంబాలు కూడా వ్యతిరేకించాయి.
ఈ భూమిని పూర్తిగా సాగు చేయడానికి మాకు పది సంవత్సరాలు పట్టింది. 2000 సంవత్సరంలో మేము మా మొదటి పంటను అమ్మినం. 2004 నాటికి స్వంతంగా ఒక ట్రాక్టర్ కొనుగోలు చేశాము. ఎందుకంటే భూమి సంవత్సరానికి రెండు పంటలు ఇచ్చింది. అప్పుడే దర్భార్లు ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దానిలో కొంత భాగాన్ని కోరుకుంటున్నారు’’ అని మక్వానా గుర్తు చేసుకున్నారు.
దాడులు అరికట్టడం..
2011 లో పంటకోత కాలంలో స్థానిక పోలీసుల సమక్షంలో దర్భార్ పురుషులు తమ బృందంపై మొదటిసారిగా హింసాత్మక దాడి చేశారని జేబీఎంకేఎం చీఫ్ చెప్పారు. పోలీసుల రక్షణలో దర్భార్ పురుషులు పంటను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా మహిళా రైతులు రోడ్డును దిగ్భంధం చేశారు.
‘‘మేము వారి కొడవళ్లను తీసుకుని పంటను సేకరించి ట్రాక్టర్ లో ఎక్కించాము. మాకు పన్నెండు గంటలు పట్టింది. ఆ పురుషులు దూరం నుంచి మమ్మల్ని చూశారు.
‘‘ఈ భూమి మా జీవితాలను మార్చివేసింది. మా పనికి మేము ప్రతి ఒక్కరూ రోజుకు రూ. 200 చొప్పున వేతనం తీసుకుంటాము. ప్రతి సభ్యునికి ప్రతి సంవత్సరం 80 నుంచి 100 కిలోగ్రాములు ధాన్యం కూడా లభిస్తుంది.
మిగిలిన పంటను మేము మార్కెట్లో అమ్ముతాము. భూమి నుంచి వచ్చే ఆదాయమే మా ప్రధాన జీవనాధారం. మేము ఇతర దళిత మహిళలను కూడా నియమించుకుని వారికి జీవనోపాధి కల్పించగలిగాము’’ అని మంగిబెన్ అన్నారు.
చిన్న ఉపశమనం..
మక్వానా, ఆమె సహచరుల దృఢ సంకల్పాన్ని గుర్తించి సీనియర్ బీజేపీ నాయకుడు, అప్పటి గుజరాత్ మంత్రి ధోల్కా ఎమ్మెల్యే భూపేంద్ర సింహ్ చుడాసమా వీరు సాగు చేస్తున్న 36 ఎకరాల భూమి యాజమాన్య హక్కున అధికారికంగా సమష్టికి బదిలీ చేయాలని సిఫార్సు చేస్తూ స్థానిక రెవెన్యూ అధికారులకు లేఖలు పంపారు.
మక్వానా, వౌతాలోని దళిత మహిళా రైతులు దాదాపు మూడు దశాబ్ధాలుగా ఈ క్షణం కోసం ఎదురు చూశారు. అయితే ఈ ఆనందం స్వల్పకాలికం.చుడాసమా సిఫార్సు చేసినప్పటికీ టైటిల్ యాజమాన్యాన్ని బదిలీ చేసే ప్రక్రియ అధికారిక బ్యూరోక్రసీ రెడ్ టేప్ లో చిక్కుకుంది.
మే 2020 నాటికి చుడాసమా రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. గుజరాత్ హైకోర్టు చుడాసమా ధోల్కా నుంచి 2017 ఎన్నిక చెల్లదని ప్రకటించింది. సుప్రీంకోర్టు కొద్దిరోజుల్లోనే ఆ ఉత్తర్వును నిలిపివేసింది. అయితే ఆయన పలుకుబడి క్షీణిస్తోంది.
ద్వంద్వ యుద్ధం..
1960 నాటి గుజరాత్ ప్రభుత్వ ‘సంతని’ పథకం కింద భూమిపై యాజమాన్యాన్ని తమకు మంజూరు చేయాలని కోరుతూ మక్వానా ఆమె బృందం రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కోర్టులలో పదేపదే పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రానికి గుజరాత్ వ్యవసాయ భూ పరిమితి చట్టం 1960 ద్వారా సేకరించిన ప్రభుత్వ యాజమాన్యంలోని బంజరు భూమి, వ్యవసాయ భూమిలేని లేదా సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు ఉపాంత వెనకబడిన తరగతుల రైతు సహకార సంఘాలకు పంపిణీ చేయడానికి వీలు కల్పిస్తుంది.
‘‘మేము రెండు కేసులపై పోరాడుతున్నాము. ఒకటి 36 ఎకరాలను జేబీఎంకేఎం అప్పగించాలని వేసిన పిటిషన్, మరొకటి గుజరాత్ భూకజ్జా నిషేధ చట్టం కింద మా పై మోపబడిన కేసు. రెండు కేసులపై వాదించడానికి నార్వ్ సర్జన్ ట్రస్ట్ న్యాయవాదులను అందించింది’’ అని మక్వానా అన్నారు.
గత పది సంవత్సరాలుగా ఆమె ధోల్కాలోని తాలుకా స్థాయిలోని పరిపాలనా కార్యాలయాలు, అహ్మాదాబాద్ నగరంలోని కలెక్టరేట్, గాంధీ నగర్ లోని సచివాలయం మధ్య నడుస్తున్నట్లు అంగీకరించింది. కానీ ఫలితం లేకపోయింది.
వదులుకోవడం లేదు
మక్వానా జేబీఎంకేఎం ను స్థాపించినప్పుడూ ఆమెకు దాదాపు 40 సంవత్సరాలు. ఆమె ఇప్పుడు లింగ అసమానత, కుల సోపానక్రమం, ఉదాసీన పరిపాలన అనే మూడు ముగ్గులతో పోరాడుతూ 36 సంవత్సరాలు గడిపింది. అయినప్పటికీ 1989 లో ఆమె మొదటిసారిగా పార తీసుకున్నప్పుడూ ఎలా ఉండేదో, నేటికీ ఆమె దృఢ సంకల్పం అలాగే ఉంది.
‘‘మేము వృద్దులమవుతున్నాము. కొనసాగుతున్న కేసులతో ఏం జరుగుతుందో, మా జీవితకాలంలో భూమిపై యాజమాన్యం లభిస్తుందో లేదో మాకు కచ్చితంగా తెలియదు. కానీ మేము వదులుకోవడం లేదు’’ అని మక్వానా అన్నారు.