మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఫలితాన్ని మార్చేశారు: రాహుల్ గాంధీ

మహారాష్ట్ర ఎన్నికల ఫలితంపై మరోసారి అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు;

Update: 2025-06-07 11:45 GMT
లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ

గత సంవత్సరం మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను అధికారపార్టీ రిగ్గింగ్ చేసి గెలిచిందని, ఈ విజయాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రంలోని ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికి ఓటర్ల జాబితా డేటాను పెద్ద ఎత్తున తారుమారు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు.

‘‘భారత ఎన్నికల న్యాయబద్దతపై నాకు అనుమానం ఉంది. ప్రతిసారి, ప్రతిచోటా ఇలాగే జరుగుతోంది. నేను చిన్నతరహ మోసం గురించి మాట్లాడటం లేదు. జాతీయ సంస్థలను స్వాధీనం చేసుకుంటున్న పారిశ్రామిక స్థాయిలోనే రిగ్గింగ్ జరిగింది. దాని గురించే నేను మాట్లాడుతున్నాను’’ అని ఓ జాతీయ మీడియాకు రాసిన ఓ వ్యాసంలో రాహుల్ అభిప్రాయపడ్డారు.
రిగ్గింగ్ కు ఐదు దశలు..
2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని బీజేపీ ఐదు దశల్లో తారుమారు చేసిందని మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎక్స్ లో ఆరోపించారు.
మొదటి దశలో ఎన్నికల కమిషన్ నియామకంలో జరిగింది. రెండో దశలో నకిలీ ఓటర్లను చేర్చారు. మూడో దశలో ఓటర్ల సంఖ్యను పెంచారు. నాలుగో దశలో బీజేపీ గెలవడానికి అవసరమైన చోట నకిలీ ఓటింగ్ యంత్రాలు సృష్టించారు. చివరిగా ఆధారాలను దాచారు’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ప్రభుత్వ ప్యానెల్ నుంచి సీజేఐ తొలగింపు
జాతీయ మీడియాకు రాసిన తన వ్యాసంలో తన మొదటి అంశాన్ని ఇలా వివరించాడు. 2024 ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం ద్వారా కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఎన్నికల కమిషనర్లను నియమించే ప్యానెల్ లో కేంద్ర క్యాబినేట్ మంత్రిని తీసుకొచ్చింది. ఇది కేంద్రానికి అనుకూలమైన మెజారిటీని తీసుకొస్తుంది. ఇప్పుడు లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడికి నిర్ణయానికి అక్కడ అవకాశమే లేదని తన వ్యాసంలో ఆరోపించారు.
‘‘సెలక్షన్ కమిటీలో చీఫ్ జస్టిస్ కు బదులుగా క్యాబినెట్ మంత్రిని నియమించాలనే నిర్ణయం విశ్వాస పరీక్షలో నెగ్గదు. ఒక ముఖ్యమైన సంస్థలో తటస్థ మధ్యవర్తిని తొలగించడానికి ఎవరైన ఎందుకు ప్రయత్నిస్తున్నారని మిమ్మల్ని ప్రశ్నించుకోండి? ప్రశ్న అడగడం అంటే సమాధానం తెలుసుకోవడమే అని రాహుల్రు అన్నారు.
ఓటర్లలో పెరుగుదల..
రెండో ఆరోపణలలో భాగంగా మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు ఆరోపించారు. 2019 లో నమోదైన ఓటర్ల సంఖ్యలో 8.98 కోట్లుగా ఉందని, 2024 లోక్ సభ ఎన్నికల్లో 9.29 కోట్లకు పెరిగిందని, అంటే 31 లక్షల ఓటర్లు మాత్రమే పెరిగారని అన్నారు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి మాత్రం అదనంగా 41 లక్షలు పెరిగారని, ఐదు నెలల్లో రాష్ట్రంలో ఇంతమంది ఓటర్లు ఎలా పెరిగారని అన్నారు.
‘‘ఐదేళ్లలో 31 లక్షల మంది కొత్తగా నమోదయ్యారు. కానీ తరువాత ఐదు నెలలో 41 లక్షల మంది పెరిగారు. మహారాష్ట్రలో 9.54 కోట్లమంది వయోజనుల కంటే 9.70 కోట్లుగా ఉన్నారు. అంటే వయోజనుల కంటే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు.
పెరిగిన ఓటర్ల సంఖ్య..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచి చూపించారని రాహుల్ తన మూడో ఆరోపణ చేశారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ శాతం 58.22 శాతంగా ఉందని, ఓటింగ్ ముగిసిన తరువాత కూడా పోలింగ్ శాతం పెరుగుతూనే ఉండి, చివరకు 66.05 శాతానికి చేరుకుందని అన్నారు.
‘‘ఈ అసాధారణ పెరుగుదల 7.83 శాతం పెరుగుదల. అంటే 76 లక్షల మంది ఓటర్లకు సమానం. ఇది మహారాష్ట్ర గత విధానసభ ఎన్నికల కంటే చాలా ఎక్కువ’’ అని రాహుల్ రాశారు.
కొన్ని స్థానాల్లో మాత్రమే పెరిగారు..
తన నాల్గవ ఆరోపణలో ఓటర్ల సంఖ్య పెరగడమే కాకుండా గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ చాలా తక్కువ ఫర్ ఫార్మాన్స్ ఇచ్చిన 85 నియోజకవర్గాలు, దాదాపు 12 వేల బూత్ లలో మాత్రమే ఓటర్ల సంఖ్య పెరిగిందని అన్నారు. ఈ 85 స్థానాల్లో బీజేపీ చాలా ఎక్కువ సంఖ్యలో గెలిచిందని చెప్పారు.
ఈ ఓటర్ల సంఖ్య పెరగడం పై ఈసీ తన అభిప్రాయాన్ని విచిత్రంగా వెల్లడించిందని అన్నారు. యువత ఓటింగ్ లో చరుకుగా పాల్గొన్నారని, స్వాగతించపరిణామంగా పేర్కొన్నారు. ఈ స్వాగత ధోరణి కేవలం 12 వేల బూత్ లకే పరిమితం అయింది. మిగిలిన 88 వేల బూత్ లకు ఎందుకు పెరగలేదని, ఇదో విషాదభరితమైన జోక్ అని రాసుకొచ్చారు.
ఆధారాలను దాచి పెట్టారు..
తన చివరి ఆరోపణలో ఆధారాలను దాచిపెట్టారని అన్నారు. ప్రతిపక్షాల నుంచి వచ్చిన అన్ని ఆరోపణలను ఈసీ తోసిపుచ్చిందని అన్నారు. సాక్ష్యాలను దాచిపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.
‘‘2024 లోక్ సభ విధానసభ ఎన్నిలకు ఫోటోలతో కూడిన ఓటరు జాబితాలను అందుబాటులో ఉంచాలనే అభ్యర్థలను తోసిపుచ్చింది’’ అని రాహుల్ అన్నారు.
సంస్థల మానిపులేషన్..
పోలింగ్ కేంద్రంలో ఓటింగ్, వీడియోగ్రఫీ,సీసీటీవీ ఫుటేజీలను విడుదల చేయాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది. అయితే కేంద్రం ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదించిన తరువాత మాత్రం సీసీటీవీ ఫుటేజ్- ఎలక్ట్రానిక్ రికార్డుల ప్రాప్యతను పరిమితం చేయడానకి 1961 ఎన్నికల నిర్వహణ నియమాల సెక్షన్ 93(2)(ఏ)ని సవరించిందని ఆరోపించారు.
‘‘2024 నవంబర్ లో మహారాష్ట్రలో రిగ్గింగ్ ఎందుకు ఇంతదారుణంగా పెరిగిందో ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ రిగ్గింగ్ అంటే మ్యాచ్ ఫిక్సింగ్ లాంటింది. ఫిక్సింగ్ చేసిన వారే గెలుస్తారు.
కానీ ఫలితం మాత్రం ప్రజలకు నష్టం చేకూరుస్తుంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విషం లాంటివి అని ఆయన అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 288 అసెంబ్లీ స్థానాల్లో 235 గెలుచుకుంది. వీటిలో బీజేపీకి సొంతంగా 132 స్థానాలు వచ్చాయి. ఇంతకుముందు అధికారంలో ఉన్న ప్రత్యర్థి మహ వికాస్ అఘాడీకి కేవలం 50 స్థానాలు మాత్రమే దక్కాయి.
Tags:    

Similar News