జేఈఈ టాపర్లంతా బాంబే కే ఎందుకు జై కొడుతున్నారు?
టాప్-10 లో 9 మంది, టాప్ -100 లో 73 మంది ఐఐటీ బాంబేకే వెళ్తున్నారేందుకు?;
By : The Federal
Update: 2025-06-21 09:43 GMT
శ్వేతా త్రిపాఠి
నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్ లో ఐఐటీ మద్రాస్ చాలా ముందున్నప్పటికీ జేఈఈ టాపర్లను మాత్రం ఆకర్షించడంలో విఫలమవుతూ ఉంది.
ఈ సంవత్సరం విడుదల చేసిన ఫలితాలలో టాప్ 500 మందిలో కేవలం 80 మంది మాత్రమే మద్రాస్ ను ఎంచుకున్నారు. ఇందులో ఎక్కువ భాగం ఐఐటీ- బాంబేను సెలెక్ట్ చేసుకున్నారు. టాప్-10 లో 9 మంది, 100 లో 73 మంది ఉన్నారు. Full View
ఈ అంతరాన్ని తగ్గించడానికి ఐఐటీ మద్రాస్ అనేక రకాల పర్యటనలు, క్యాంపస్ విస్తరణ ప్రారంభించారు. కానీ ఐఐటీ బాంబే ను మాత్రం అందుకోలేకపోయారు.
విద్యార్థుల ప్రాధాన్యత మారడం..
ఐఐటీ మద్రాస్ ఆరు దశాబ్ధాలకు పైగా ఇంజనీరింగ్, టెక్నాలజీ విద్యను అందిస్తూ అగ్రగామిగా ఉంది. కానీ విద్యారంగంలో అభివృద్ది చెందుతున్న నూతన పోకడలను సరైన విధంగా అందుకోలేకపోయింది. విద్యార్థులు తమ సీట్లను ఎంచుకోవడానికి కేవలం విద్యా ర్యాంకింగ్స్ లు మాత్రమే కాకుండా మరెన్నో వాటిని పరిగణలోకి తీసుకుంటున్నారు.
కెరీర్ కన్సల్టెంట్ జై ప్రకాశ్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ఐఐటీ చెన్నై ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఐఐటీ- బాంబేలో విద్యార్థులు పొందే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
పెద్ద కార్పొరేట్ సంస్థలతో సంబంధం, పూర్వ విద్యార్థులు మద్దతు, సిలబస్ ను మించి నేర్చుకోవడడం, కొత్త కంటేంట్’’ ఇవన్నీ మద్రాస్ కంటే బాంబే ముందుటంలో సాయపడుతున్నాయి. పూర్తి స్థాయిలో వివరించాలంటే ఎడ్జ్ కచ్చితంగా బాంబే వైపే ఉంది.
బాంబేనే ఎందుకు ముందుకు?
భారత ఆర్థిక రాజధాని, విశ్వనగర కేంద్రం అయిన ముంబైలో ఉండటం వలన ఐఐటీ బాంబే అనేక ప్రయోజనాలను పొందుతోంది. నగరంలో ఉన్న ఉత్సాహభరితమైన వాతావరణం, పరిశ్రమలు ఎక్కువ సంఖ్యలో ఉండటం, నగరంతో ప్రపంచంతో ఉన్న సంబంధాలు విద్యార్థులకు ఆకర్షణీయంగా ఉంటున్నాయి.
‘‘ఐఐటీ బాంబే లో చాలా స్నేహపూర్వక సంస్కృతి ఉంది’’ అని గాంధీ అన్నారు. ‘‘కాన్పూర్ కూడా చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. అధ్యాపకులు వచ్చి వారికి ఏదైనా సహాయం చేస్తారు. కానీ చెన్నైలో అలాంటి వాతావరణం లేదు’’
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పూర్వ విద్యార్థుల మద్దతు లో మద్రాస్ వెనకబడి ఉంది. ‘‘ఐఐటీ బాంబే ఇటీవల పూర్వ విద్యార్థుల నుంచి 16.4 బిలియన్ డాలర్ల వెంచర్ క్యాపిటల్ నిధులను సేకరించింది. ఇలాంటి వాటిలో ఐఐటీ మద్రాస్, ఢిల్లీ, కాన్పూర్ కంటే వెనకబడి ఉంది’’ అని గాంధీ పేర్కొన్నారు.
దక్షిణాన ఖాళీలు..
దక్షిణాది విద్యార్థులు ఇప్పటికీ ఐఐటీ - మద్రాస్ వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ జాతీయ ప్రాధాన్యతలలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ గుర్తింపు, వెంచర్ క్యాపిటల్ యాక్సెస్, వైవిధ్యభరితమైన కెరీర్ పర్యావరణ వ్యవస్థ తో ఐఐటీ బాంబేను స్పష్టమైన విజేతగా నిలిపాయి. ‘‘చెన్నైలో ఉన్న దానికంటే ఇక్కడి సంస్కృతి పర్యావరణ వ్యవస్థ పూర్తిగా భిన్నంగా ఉంటుంది’’ అని గాంధీ చెప్పారు.
ఐఐటీ మద్రాస్ ఏం చేస్తోంది..
ఈ ధోరణిని తిప్పికొట్టడానికి ఐఐటీ మద్రాస్ చర్యలు తీసుకుంటోంది. పూర్వ విద్యార్థులతో వర్చువల్ గా సమావేశాలు నిర్వహించడం, సమావేశాలు ఏర్పాటు చేస్తోంది.
అంతా కలిసికట్టుగా ఉండటానికి క్యాంపస్ సంస్కృతిని నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాలపై ‘ది ఫెడరల్’ అడిగిన ప్రశ్నలకు ఇన్ట్సిట్యూట్ స్పందించలేదు.
ఐఐటీ మద్రాస్ కు తిరిగి పున: వైభవాన్ని పొందడానికి పరిశ్రమ భాగస్వామ్యం పెంపొందించడం, ఇంటర్న్ షిప్ యాక్సెస్ పెంచడం, దాని విజయాలను ప్రదర్శించడం వలన లాభం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ సంస్థలో ఇప్పటికే క్రిస్ గోపాలకృష్ణన్, శ్రీధర్ బెంబు, వినీతా సింగ్ వంటి ప్రముఖ పూర్వ విద్యార్థుల ఉన్నారు. వీరిని మరింత బాగా ఉపయోగించుకోవాలి. విద్యార్థులు ర్యాంకింగ్స్ కంటే నెట్ వర్కింగ్, గ్లోబల్ ఎక్స్ పోజర్, క్యాంపస్ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
అందువల్ల ఐఐటీ మద్రాస్ కొత్త ఆవిష్కరణలు, అనుకూలతలు నిర్ణయించాల్సి ఉంటుంది. ఇవన్నీ బొంబాయి ఐఐటీతో ఉన్న గ్యాప్ ను పూరిస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి.