తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా రామచంద్రరావు

సీనియర్లందరికి షాక్ ఇచ్చిన బిజెపి హైకమాండ్;

By :  Admin
Update: 2025-06-30 06:26 GMT

ఏడాది కాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు సోమవారం తెరపడింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సోమవారం మధ్యాహ్నం నామినేషన్ వేయాలని బీజేపీ అధిష్ఠానవర్గం రామచంద్రరావును ఆదేశించింది. ఈ విషయాన్ని బీజేపీ నాయకురాలు ఉమా సుధీర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేసే ఏకైక వ్యక్తి ఎన్.రాంచందర్ రావు పార్టీవర్గాలు వెల్లడించడంతో అతన్ని బీజేపీ నేతలు అభినందనలతో ముంచెత్తారు. నామినేషన్ అనంతరం అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీ పడినా ఎన్ రామచంద్రరావుకు ఉన్న ఆర్ఎస్ఎస్ నేపథ్యం, విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో పనిచేసిన అనుభవం వల్లనే ఆయన కాషాయ పార్టీ పగ్గాలు దక్కాయని కమలనాథులు చెబుతున్నారు.

ఎన్.రాంచందర్ రావు ప్రస్థానం

66 ఏళ్ల నరపరాజు రాంచంద్రరావు 1959 ఏప్రిల్ 27వతేదీన జన్మించారు. ఈయన ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎల్ఎల్ బీ చేసి న్యాయవాదిగా వృత్తి చేపట్టినా పూర్తి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈయన 2015 నుంచి 2021 వ సంవత్సరం వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి తెలంగాణ శాసన మండలి (MLC) సభ్యుడిగా పనిచేశారు.అనంతరం భారతీయ జనతా పార్టీ తెలంగాణ సభ్యత్వ డ్రైవ్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు.1985 వ సంవత్సరంలో న్యాయవాద వృత్తి స్వీకరించినా 2014లో బార్ కౌన్సిల్ సభ్యుడయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.

కుటుంబం

రాంచందర్ రావు తండ్రి ప్రొఫెసర్ ఎన్ వి ఆర్ఎల్ ఎన్ రావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్‌గా పనిచేశారు. రాం చందర్ రావు కుమార్తె అముక్త నరపరాజు ఆస్ట్రేలియాలో ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు అవనీష్ నరపరాజు తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అతని భార్య సావిత్రి 2017వ సంవత్సరంలో దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు.

Tags:    

Similar News