‘‘విధ్వంసక శక్తులను వదిలిపెట్టను’’
ఢిల్లీ పేలుడుపై ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక
దేశ రాజధాని ఢిల్లీలో బాంబుదాడికి పాల్పడిన నిందితులకు మోదీ గట్టి హెచ్చరిక జారీ చేశారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని చెప్పారు. ‘‘అమాయాక ప్రజల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టబోనని దేశ ప్రజలకు నేను హమీ ఇస్తున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు.
దర్యాప్తు సంస్థలు ఇప్పటికే విచారణను ముమ్మరం చేశాయని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బాధ్యులందరిని చట్టం ముందు నిలబెట్టడం ద్వారా బాధితులకు న్యాయం చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు.
మరో వైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇదే విషయాన్ని ధృవీకరించారు. దేశంలో ఉగ్రవాద దాడికి పాల్పడిన వారందరికి నిద్రలేని రాత్రులు మిగులుస్తామని హెచ్చరించారు.