పూణేలో కూలిన వంతెన

శిథిలాల కింద 20 నుంచి 25 మంది చిక్కుకున్నట్లు సమాచారం..;

Update: 2025-06-15 14:28 GMT

మహారాష్ట్ర (Maharashtra) పూణే జిల్లాలోని ఇంద్రాయణి నదిపై నిర్మించిన ఇనుప వంతెన ఆదివారం (జూన్ 15) మధ్యాహ్నం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో

చాలా మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా వంతెన కూలిపోవడంతో 25 నుంచి 30 మంది పర్యాటకులు నదిలో పడిపోయి ఉంటారని సమాచారం. మరణాల గురించి అధికారులు ప్రకటించకపోయినా.. ఆరుగురు చనిపోయినట్లు సమాచారం అందుతోంది.

స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం, NDRF బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. వంతెన శిథిలాల కింద 10 నుంచి15 మంది చిక్కుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఎలాంటి ప్రాణనష్టం లేదు..

ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (C M Devendra Fadnavis) స్పందించారు. చాలా మంది గాయపడ్డారని, అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.

"మావల్‌లో వంతెన కూలిపోయిందని తెలిసింది. నేను డివిజనల్ కమిషనర్, తహసీల్దార్, పోలీసు కమిషనర్‌తో మాట్లాడాను. గాయపడ్డ గారిని ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. NDRF బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. నదిలో కొంతమంది కొట్టుకుపోయి ఉండవచ్చు. ప్రాణనష్టంపై సమాచారం లేదు. దాని గురించి ఇప్పుడు మాట్లాడటం సముచితం కాదు,”అని ANIతో చెప్పారు దేవేంద్ర ఫడ్నవీస్.

Tags:    

Similar News