YS JAGAN- SHARMILA | జగన్ మనిషి జాబితాలో లేరంటున్న షర్మిల

రక్తసంబంధం, అనుబంధం అనే మాటలు పలికే అర్హత వైసిపికి లేదని రోజాకు వైఎస్. షర్మిల ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-10 13:45 GMT

తల్లి, చెల్లిని దూరం చేసుకున్న రోజునే మనిషి జాబితా నుంచి బయటకు వచ్చారు అని వైఎస్. జగన్ ఉద్దేశించి, ఆయన చెల్లెలు, పిసిసి అధ్యక్షురాలు వైఎస్. షర్మిల రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. రక్తసంబంధం, అక్క చెల్లెల అనుబంధం గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఏ మాత్రం లేదు అని ఆమె వ్యాఖ్యానించారు. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై వైయస్ షర్మిల ఘాటుగా స్పందించారు.

"బాలకృష్ణ ఇంటి నుంచి విష్ప్రచారం జరిగిన సమయంలో నేను చాలా బాధపడ్డాను. మీరు, వైసిపి, నా రక్త సంబంధం (అన్న వైయస్ జగన్) చేసిన విష ప్రచారానికి నేను ఎంత బాధపడి ఉంటాను" గ్రహించారా అని వైఎస్ షర్మిల నిలదీశారు. అనుబంధాలు, రక్త సంబంధానికి ఏ మాత్రం విలువ ఇవ్వని వైసీపీ పార్టీ నాయకుల నోట ఈ మాటలు ఏమిటిని ఆమె నిలదీశారు. 
అనంతపురం జిల్లా పుట్టపర్తి లో మంగళవారం జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యకర్తల సమావేశంలో వైఎస్. షర్మిల మాట్లాడారు. మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తసంబంధం విలువ ఏంటో నాకే తెలుసు అని హెచ్చరించారు.
"నాకు అక్రమ సంబంధాలు అంటగడితే నేను వైఎస్సార్ కి పుట్టలేదు అని మీ సైతాన్ (వైఎస్ జగన్) తన సైన్యంతో ప్రచారం చేయించడం అనుబంధానికి, ఆత్మీయతకు, రక్త సంబంధానికి ఇచ్చే విలువ ఇదేనా" అని ఆర్కే రోజాను ఉద్దేశించి షర్మిల సూటిగా ప్రశ్నించారు.
నేను వైయస్సార్ బిడ్డని
నేను వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురిని గుర్తించుకోండి అని హెచ్చరించారు. టిడిపి అధ్యక్షుడు, సీఎం ఎన్. చంద్రబాబుకు మద్దతు ఇచ్చే పరిస్థితి వైఎస్సార్ బిడ్డగా నాకు రాదు అని షర్మిల వ్యాఖ్యానించారు.
"Ysr వ్యతిరేకించిన బిజెపికి ఆయన కొడుకు జగన్ ఇన్ని ఏండ్లు మద్దతు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి దత్తపుత్రుడుగా మారారు. ఐదేళ్లు బిజెపికి జగన్ ఊడిగం చేశారు. ప్రతి బిల్లుకు కేంద్రంలో జగన్ మద్దతు ఇచ్చారు" అని గుర్తు చేసిన వైఎస్. షర్మిల ఇప్పుడు చెప్పండి రోజా ఎవరు.. ఎవరికి మద్దతు ఇచ్చారని సూటిగా నిలదీశారు.
"నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు. నా రక్త సంబంధమే నామీద విష ప్రచారం చేసింది. నేను వైయస్సార్ కి పుట్టలేదు అన్నారు. విజయమ్మకు అక్రమసంతానమన్నారు" అని గుర్తు చేసుకున్న వైయస్ షర్మిల తీవ్రంగా కలత చెందారు. ఈ పరిస్థితి కల్పించి, రక్తసంబంధం, అక్కా చెల్లి, అన్నా తమ్ముడి అనుబంధం గురించి వైసిపి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని షర్మిలా రెడ్డి ఎద్దేవా చేశారు.
అడిగి ఉంటే ప్రాణం ఇచ్చేదాన్ని
రక్తసంబంధం విలువ ఏమిటో నేను చెబుతా అని మాజీ మంత్రి ఆర్కే రోజాకు వైఎస్. షర్మిల అన్నారు. అన్న జగన్ కష్టాల్లో ఉన్నాడని మాట అడిగి అడగంగానే 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. నా బిడ్డలు భర్తను కూడా పక్కన పెట్టి ఎండలో నడక సాగించారు ఇది రక్తసంబంధానికి ఉన్నవా విలువ అని ధీటుగా సమాధానం చెప్పారు.
"జగన్ చేయిచాచి ప్రాణం ఇవ్వమని అడిగిన ఇచ్చే దాన్ని" అని వైయస్ షర్మిల గద్గద స్వరంతో అన్నారు. అన్నగా వైయస్ జగన్ ఎంత ప్రేమించారో నాకు తెలుసు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు అంటూ,
"తల్లి, చెల్లిని దూరం చేసుకున్న రోజే మీరు మనిషి జాబితా నుంచి బయటకు వచ్చారు" అని అన్న వైయస్ జగన్ ను ఉద్దేశించి షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. "మీరు మనుషులు కారు. మీరు రక్త సంబంధాల గురించి మాట్లాడడానికి సిగ్గుండాలి" అని వైసిపి, జగన్, ఆర్కే రోజా నువ్వు ఉద్దేశించి షర్మిల శాపనార్థాలు పెట్టారు. వైయస్ విజయమ్మను పార్టీ నుంచి వెళ్లగొట్టిన నాడే మీ పతనానికి మీరే నాంది పలుక్కున్నారనీ ఆమె గుర్తు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షురాలుగా నేను మద్దతు ఇచ్చేది ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాలకు మాత్రమే అని వైఎస్. షర్మిలా రెడ్డి స్పష్టం చేశారు.

Similar News