వైసీపీ కార్యకర్తను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు
కమ్మ సామాజికి వర్గానికి చెందిన వాడివైనా ఎందుకు నువ్వు వైసీపీలో ఉన్నావని బాధితుడిని డీఎస్పీ అవమానించినట్లు జగన్ పేర్కొన్నారు.;
వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని రాజుపాలెం మండలం, పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ అనే వైసీపీ కార్యకర్త తనను టీడీపీ నేతలు, పోలీసులు వేధించి, హింసించారని తీవ్ర మనోవేధనకు గురై శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. దీనిపైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అర్థరాత్రి సోషల్ మీడియా వేదికగా ఆయన సీఎం చంద్రబాబు పాలనపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెడ్బుక్ రాజ్యాంగానికి వైయస్సార్సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించారు. తనపై గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి… pic.twitter.com/DQYqumM3Hz
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2025