వాళ్లను జగన్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు
శుక్రవారం సీఎం చంద్రబాబు కడప జిల్లా పర్యటన చేశారు.;
నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నోరు పారేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగితే అతనిని మందలించాల్సింది పోయి నల్లపరెడ్డిని ప్రోత్సహిస్తున్నాడని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. మహిళలను, వారి వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న వారిని జగన్ ఎంకరేజ్ చేస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సీఎం చంద్రబాబు కడప జిల్లా పర్యటన చేపట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు గూడెంచెరువులో నిర్వహించిన ప్రజావేదిక మీద ఆయన మాట్లాడుతూ పార్టీలో ఎవరైనా తప్పులు చేస్తే వాటిని తక్షణమే ఖండించాలి.. తప్పులు చేసిన వారిని మందలించాలి.. కానీ జగన్ మాత్రం అలాంటి వారిని ఇంకా రెచ్చగొడుతున్నాడని ధ్వజమెత్తారు.
పార్టీ నాయకులను, శ్రేణులను క్రమశిక్షణలో పెట్టాల్సిన నాయకుడే మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వారిని మహిళలపై ఇంకా విరుచుకుని పడాలనే ధోరణితో రెచ్చగొడుతున్నారని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ గురించి ప్రస్తావించారు. వివేకానందరెడ్డి హత్య జరిగితే తమపై విషయం చిమ్మారని, మాటలు మారుస్తూ, తనపై లేని పోని అబాండాలు వేశారని వైసీపీ పార్టీ నాయకుల మీద, వైఎస్ జగన్ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.