శభాష్‌ కడప..దేవుని గడప

పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. 2027 డిసెంబరులోగా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు.;

Update: 2025-05-29 12:05 GMT

కడప మహానాడు నిర్వహణపై టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమాలను ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించినందుకు కడప జిల్లా టీడీపీ నాయకులను ఆయన అభినందించారు. శభాష్‌ కడప..దేవుని గడప అంటూ వ్యాఖ్యానించారు. దేవుని గడప అయిన కడపను అన్ని రకాలుగా డెవపల్‌ చేసి తీరుతానని మహానాడు వేదిక మీద నుంచి హామీ ఇచ్చారు. మూడో రోజు మహానాడు భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాయలసీమను అన్ని రకాలుగా డెవలప్‌ చేసి రాష్ట్రానికొక మణిహారంగా తయారు చేస్తానని  రాయలసీమ నాయకులు, ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. రాయలసీమలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.

ఎస్సీ వర్గీకరణకు అందరికంటే ముందే తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనే శ్రీకారం చుట్టిందని, అయితే దీనిపై కొంత మంది కోర్టుకెళ్లారని, దీంతో సుప్రీం కోర్టు దానిని కొట్టేసిందని చంద్రబాబు వెల్లడించారు. అయితే అదే సుప్రీం కోర్టు ఈ సారి వర్గీకరణకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసిందన్నారు, ఆ ప్రకారం ఎస్సీ వర్గకరణ చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం అనుకూలంగా ఉందన్నారు. సోలార్‌ ప్యానల్స్‌ ద్వారా అందరికీ లబ్ధి చేకూర్చుతామన్నారు. అమరావతిలో పొట్టిశ్రీరాము  లు మెమోరియల్‌ ఏర్పాటు చేస్తామన్నారు.
గత ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తే కూటమి ప్రభుత్వం వారిని ఆదుకుంటుందన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేసి భూములను కాపాడామన్నారు. 22ఏలో భూములను పెట్టి కొట్టేయడానికి వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నిందన్నారు. రానున్న మహానాడు నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నింటిని పరిçష్కరించి తీరుతామన్నారు, ఉగ్రవాదుల వల్ల దేశానికి ముప్పు ఉందని, ఈ ఉగ్రవాదులు భూమి మీద ఉండటానికి వీల్లేదని, వీరిని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టిందన్నారు, ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా రాష్ట్రానికి ముప్పు ఉందన్నారు. వీరి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. గత ఐదేళ్లల్లో అన్నీ దోచుకున్నారని, జే బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారని మండిపడ్డారు. ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తానని హెచ్చరించారు.
ఢిల్లీలో మన పరపతి పెరిగిందని, కేంద్రం సహకారంతో ఏపీని డెవలప్‌ చేస్తామన్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. 2027 డిసెంబరులోగా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. మన రాజదాని అమరావతేనని, దీనిని అంతర్జాతీయ ప్రమాణాలతో డెవలప్‌ చేస్తామన్నారు. అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ అందుబాటులోకి తెస్తామన్నారు. వర్క్‌ ఫ్రం హోమ్‌ ద్వారా యువతకు ఉపాధి కల్పన చేస్తామన్నారు.
నన్ను నమ్మండి.. మీమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది అని టీడీపీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు, ఆరు నెలలో కడప హజ్‌ హౌస్‌ను పూర్తి చేస్తానని చెప్పారు. హైకోర్టు బెంచ్‌ను కర్నూలుకు తెస్తామన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్లకు శంకుస్థాపన చేస్తామన్నారు, అన్నమయ్య ప్రాజెక్టును కట్టే బాద్యతను తీసుకుంటామన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేసి, రాయలసీమ రతనాల సీమగా మారుస్తానన్నారు. తాను ఏదైనా సంకల్పం చేస్తే విడిచిపెట్టనన్నారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టును పూర్తి చేసి అందరి గుండెల్లో చిరస్తాయిగా నిలచిపోతానన్నారు. గాలేరు నగరి ప్రాజెక్టుకు రూ. 1000 కోట్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
గండికోటను బెస్ట్‌ టూరిజమ్‌ స్పాట్‌గా చేస్తామని, దీని కోసం రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమశి నుంచి బద్వేలుకు నీళ్లిచ్చే కార్యక్రమాన్ని కూడా అమలుచేస్తామన్నారు. నాడు హైదరాబాద్‌లో జరిగిన అభివృద్దే తెలంగాణను ఆదుకుంటోందని అన్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో జీరో పావర్టీ లక్ష్యంగా పని చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తామన్నారు, హెల్తీ..వెల్తీ సొసైటీ కోసం కష్టపడి పని చేస్తానన్నారు. వచ్చే నెల 21న ఐదు లక్షల మందితో విశాఖలో యోగా చేసి రికార్డు నెలకొల్పనున్నట్లు చెప్పారు. మహానాడుకు హాజరైన ప్రతి కార్యకర్త క్షేమంగా తిరిగి ఇంటికెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Tags:    

Similar News