తిరుచానూరు పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ..

టిటిడి ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీకి ఏర్పాట్లు చేశామన్న మంత్రి ఆనం

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-17 13:15 GMT
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయం, పద్మపుష్కరిణి

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.  రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి సోమవారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు.


తిరుచానూరు ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి రామనారాయణరెడ్డికి ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతించారు. టిటిడి జేఈఓ  వి. వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.


మంత్రి రామనారాయణరెడ్డికి పరివట్టం కట్టిన తరువాత వెండిపళ్లెంలో అమ్మవారికి సమర్పించే చీర, సారెను ఉంచారు. ఆ పళ్లెం తలపై పెట్టుకున్న మంత్రి రామనారాయణరెడ్డి అమ్మవారి ఆలయం ధ్వజస్తంభం వద్ద మొక్కులు చెల్లించి, ఆలయంలోకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుని వచ్చిన సారెను ఆలయ అర్చకులకు అందించారు. ఆ తరువాత ఆశీర్వాద మండపంలో మంత్రి రామనారాయణరెడ్డికి వేదపండితులు వేదాశీర్చనం అందించారు. టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం తీర్థప్రసాదాలు అందించారు. ఆయన వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జీ. నరసింహయాదవ్, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ. మునికృష్ణ తోపాటు నాయకులు అధికారులు ఉన్నారు. 



 


అనంతరం మంత్రి రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..

"ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆలోచనల మేరకు టిటిడి ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీకి చర్యలు చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే చర్యలు చేపట్టాం" అని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. 
 తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో పంచమితీర్థం రోజున దాదాపు 50 వేలకు పైగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, దీనికి తగినట్లు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన టీటీడీ అధికారులకు సూచించారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల కోసం టీటీడీ అన్ని వ‌స‌తులు క‌ల్పించింద‌న్నారు.20
20 న రాష్రపతి రాక
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20 వ తేదీ రానున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. 21 తేదీ రాష్ట్రపతి తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు రానున్నారని  ఆయన వెల్లడించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో టీటీడీ విజివో  గిరిధర్, ఏవీఎస్వో రాధాకృష్ణ మూర్తి, టిటిడి ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, అధికారులు పాల్గొన్నారు.
Tags:    

Similar News