'కడప స్టీల్ ప్లాంట్' స్వప్నం సాకారం చేస్తాం
ఈ పనులు పది రోజుల్లో ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీయని అని స్పష్టం చేశారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-28 15:03 GMT
ఒక ప్రాంత ప్రజల కోసం మరో రాష్ట్ర అవసరాలను దెబ్బతీయను అని సీఎం ఎన్. చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమాత్రం నష్టం కలిగించని విధంగానే రాయలసీమ సమగ్రాభివృద్ధికి కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
కడప మహానాడులో సీఎం చంద్రబాబు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. "కడప స్టీల్ ప్లాంట్ పనులు పది రోజుల్లో ప్రారంభమవుతాయి" అని చంద్రబాబు వెల్లడించారు. ఈ ప్లాంట్ పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పనిచేసే కడప ప్రాంత ప్రజల చిరకాల కలను సాకారం చేస్తామని ఆయన చెప్పారు.
కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ప్లీనరీలో బుధవారం రాయలసీమ డిక్లరేషన్ పై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందులో "రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ ఉత్తరాంధ్ర అభివృద్ధి- రాయలసీమ అభివృద్ధి, రాయలసీమ డిక్లరేషన్ అమరావతి అభివృద్ధి ముఖ్యంద్రీకరణ". అనే అంశాలపై పార్టీ ప్రతినిధులు చర్చించారు.
రాయలసీమ డిక్లరేషన్ పై మహానాడులో జరిగిన చర్చలకు సీఎం చంద్రబాబు సమాధానం ఇచ్చారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ పనులు పది రోజుల్లో ప్రారంభించడం ద్వారా రాయలసీమ అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. రోజుల వ్యవధిలోనే ఇక్కడ పనులు ప్రారంభమవుతాయని ఆయన ప్రకటించారు. టిడిపి మహానాడు ప్రారంభానికి ముందే అధికారులు, పార్టీ ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించినట్లు చంద్రబాబు చెప్పారు.
సీమ సస్యశ్యామలం
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే రాయలసీమ పై ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. హంద్రీనీవా, ఎస్ ఎల్ బి సి, గాలేరు నగిరి ప్రాజెక్టు, ఏసీ కెనాల్ ఆధునీకరణ వంటి పనులు చేయడం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు, రానున్న కాలంలో కరువును పాలదోలెందుకు మరింత శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తామన్నారు. అక్కడి నుంచి బనకచర్లకు నీటిని తరలించి రాయలసీమకు మరింత మేలు చేయడానికి కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు.
రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు
తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా తనకు ఆంధ్ర తెలంగాణ రెండు కళ్ళు లాంటివి అనే సీఎం చంద్రబాబు తన మాటలను పునరుద్ఘాటించారు.
రాయలసీమ సస్యశ్యామలం చేసే బనకచర్లపై టిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు సరికాదని ఆయన వివరణ ఇచ్చారు. వెనకచర్లను ప్రస్తావిస్తూనే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి తాను ఎప్పుడూ వ్యతిరేకించిన దాఖలాలు లేవని తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి ఆయన స్పష్టం చేశారు..
తెలుగు రాష్ట్రాలు రెండు సుభిక్షంగా ఉండాలని టిడిపి ప్రగాఢంగా విశ్వసిస్తోందని చెప్పారు. తెలంగాణకు ఏపీ అత్యంత దిగువన ఉన్న రాష్ట్రమని, వరదలు వస్తే నీరంతా సముద్రంలో కలిసి వృధా అవుతుందనే తెలంగాణ ప్రాంత ప్రజలకు ఆయన స్పష్టం చేశారు.
ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటిని పోలవరం ద్వారా మళ్లించడానికి మాత్రమే రాయలసీమ అభివృద్ధి కోసం ప్రాజెక్టు నిర్మాణానికి నాంది పలికినట్లు ఆయన వివరించారు. తెలంగాణకు కేటాయించిన నీటి వాటాల్లో చొక్కా కూడా తోడుకోబోము అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఎవరికీ నష్టం లేదు
వరద నీటిని మళ్లించడంలో ఆంధ్ర కోసం తెలంగాణకు ఎలాంటి నష్టం కలగబోనివ్వమని సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ పరిశ్రమను తొలగించి ఏపీలో పెట్టాలని తాను కోరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కర్ణాటకలో జరుగుతున్న ఈ ప్రచారం సత్యదూరమైనదని ఆయన ఖండించారు. తను ఎప్పుడు అలాంటి పనులు చేయబోనని ఆయన కర్ణాటక ప్రాంత ప్రజలకు కూడా స్పష్టం చేశారు.
రాయలసీమలో అనంతపురం జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు రావలసిన అవసరాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఈ ప్రాంతం లో లేపాక్షి పరిసరాలు ఏరోస్పేస్ పరిశ్రమలకు అనుకూలమని చెప్తూ దీనిపై కేంద్రంతో చర్చించిన విషయాన్ని ఆయన వెల్లడించారు.
స్టీల్ ప్లాంట్ తో ఆదుకుంటాం
కడప స్టైల్ ప్లాంట్ పూర్తి చేయడానికి పది రోజుల్లో పనులు ప్రారంభిస్తాం అని సీఎం చంద్రబాబు చెప్పారు.. గతంలో జిందాల్ ప్లాంట్ శంకుస్థాపన చేసిన పనులు ప్రారంభం కాలేదు. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల మూడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి అన్నారు. కడప జిల్లా ప్రజల చిరకాల కోరిక స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించడం ద్వారా త్వరితగతిన పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో టిడిపి కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మహానాడు వేదిక నుంచి సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు.