చెత్తనే కాదు వాటిని కూడా క్లీన్ చేస్తా
పల్నాడులో జాగ్రత్తగా ఉండాలని, ప్రజలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
చెత్తను తొలగించడంతో పాటుగా చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తామని, చెత్తను తీస్తేనే సరపోదని, మనసులో చెత్తను కూడా పూర్తిగా తొలగించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన పల్నాడు జిల్లా మాచర్ల పర్యటన చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన స్థానిక చెరువు వద్ద చెత్తను ఊడ్చారు. అనంతరం కార్మికులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరంగా మార్గదర్శి– బంగారు కుటుంబాలతో ఆయన సమావేశం అయ్యారు. అనంతరం ఆయన అక్కడ నిర్వహించిన ప్రజా వేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. మాచర్లకు స్వాతంత్య్రం వచ్చింది. అందరిలోనూ సంతోషం కనిపిస్తోంది. ఇది శాశ్వతం కావాలన్నారు. ఎక్కడో రాజీవ్ గాంధీ హత్య జరిగితే.. మాచర్లలో రౌడీలు విధ్వంసం సష్టించారు.