కరేడులో 8,200 ఎకరాలను తీసుకుంటాం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ స్టాంప్స్‌ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అసెంబ్లీలో వెల్లడించారు.;

Update: 2025-09-18 07:58 GMT

కరేడు భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కరేడు భూములను రైతుల నుంచి తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడించారు. శాసనమండలిలో గురువారం కరేడు భూముల సేకరణపై తూమాటి మాధవరావు అడిగిన ప్రశ్నకు ఆయన మండలిలో సమాధానం చెప్పారు. కరేడు ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో రైతుల నుండి భూములను సేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. 8,200 ఎకరాలను భూసేకరణ ద్వారా సేకరిస్తామన్నారు. అయితే భూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కరేడు గ్రామంలోని కుటుంబాలకు ఉపాధిని కల్పించే బాధ్యత తమ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పారిశ్రామిక హబ్‌ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగఅవకాశాల్లో స్థానికులకే మొదటి అవకాశాలు కల్పిస్తామన్నారు. కరేడులో మొత్తం ఇండోసోల్‌ కంపెనీ ఏర్పాటుచేయబోయే పారిశ్రామిక హబ్‌ కు 8,200 ఎకరాలు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులను ఒప్పించి భూసేకరణ చేస్తున్నామని వెల్లడించారు.

ఇప్పటికే 500 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు లిఖిత పూర్వకంగా అంగీకారం తెలిపారని వెల్లడించారు. పారిశ్రామిక హబ్‌ ఏర్పాటు ద్వారా తమ ప్రాంత రూపురేఖలు మారతాయని రైతులు నమ్మినట్లు మంత్రి వెల్లడించారు. నిజమైన పారిశ్రామికాభివృద్ధిని సాధించేందుకు సిఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. కియా పరిశ్రమ రావడంతో అనంతపురం జిల్లా అభివద్ధిలో పరుగులు తీసింది. వాన్‌ పిక్‌ ప్రాజెక్ట్‌ వచ్చి ఉంటే తమ జిల్లా అయిన బాపట్ల కూడా ఎంతో అభివృద్ధి చెంది ఉండేది అని అనగాని సత్యప్రసాద్‌ స్పష్టం చేశారు. రేపటి రోజున కరేడు ప్రాంతం రూపురేఖలు కూడా మారిపోతాయి. పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉధ్దేశ్యంతోనే భూ సేకరణ చేస్తున్నాం. నా బంధువులకో, నా స్నేహితులకో పరిశ్రమలు ఇవ్వడం లేదన్నారు. వేరోకరి పరిశ్రమలను, ఫ్యాక్టరీలను లాక్కునే ప్రభుత్వం తమది కాదని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడించారు.
Tags:    

Similar News